Pawan Khera: డీకే, సిద్ధరామయ్యల మధ్య భేదాభిప్రాయాలు లేవు.. పవన్ ఖేరా స్పష్టత
Pawan Khera Clarity On DK Shivakumar Siddaramaiah Clash: కర్ణాటక సీఎం కుర్చీ విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య నడుస్తున్న పంచాయితీపై ఏఐసీసీ మీడియా ఛైర్మన్ పవన్ ఖేరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అసలు కాంగ్రెస్లో నాయకుల మధ్య ఫైటింగ్ ఉండదని, కేవలం హెల్తీ కాంపిటీషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉండే పోటీ.. పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని వ్యాఖ్యానించారు. బీజేపీలోనే విభేదాలున్నాయని, అందులో 9 గ్రూపులు ఉన్నాయని చెప్పారు.
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ని కరిచిన కుక్క.. వీడియో వైరల్
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కర్ణాటకలో తమ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించిందని పవన్ ఖేరా తెలిపారు. గత 9 సంవత్సరాలలో బీజేపీ నిత్యవసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచేసి, పేదలను ఇబ్బందుల్లో నెట్టిందని విమర్శించారు. ప్రధాని మోడీ ఎన్ని ర్యాలీలు చేసినా.. ప్రజలు మాత్రం ఆదరించలేదని కౌంటర్లు వేశారు. మోడీ ర్యాలీ చేసిన చోట కూడా బీజేపీని ఓడించారని చురకలంటించారు. టిప్పు సుల్తాన్ మొదలుకొని, కేరళ స్టోరీ లాంటివన్నీ బీజేపీ ప్రదర్శించిందని.. అయితే కర్ణాటక ప్రజలు ఆ పార్టీని ఓడించి, తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీ స్కీమ్లు ఇచ్చామన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఇచ్చిన హామీలను మొదటి క్యాబినెట్లోనే అమలు చేశామని గుర్తు చేశారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ను పబ్లిక్లో ఉరితీయాలి.. ప్రతిపక్ష నేత సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మాదిరిగా తమ కాంగ్రెస్ పార్టీలో సీఎంల ఎంపిక ఉండదని.. ఢిల్లీ నిర్ణయించదని పవన్ ఖేరా క్లారిటీ ఇచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారని.. ఇప్పుడు కర్ణాటక ఎపిసోడ్లో అదే జరుగుతోందని వెల్లడించారు. అధిష్టానం అందరి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. ఇంతకీ.. బీజేపీ ప్రతిపక్ష నేతను ఎన్నుకుందా? అందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది? అని ప్రశ్నించారు. రాజస్థాన్లో కూడా తమ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!