Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohith Vemula: 2016లో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల మరణం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై హైదరాబాద్ పోలీసులు విచారణను ముగించారు. తాను దళితుడు కాదనే విషయం బయటపడుతుందనే భయంతోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డాడని కోర్టుకు పోలీసులు క్లోజర్ రిపోర్టు సమర్పించారు. అయితే, పోలీసుల విచారణను రోహిత్ వేముల తల్లి అంగీకరించలేదు. దీనిపై మరోసారి విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
READ ALSO: Dinesh Karthik: నాకు బ్యాటింగ్ వస్తుందనుకోలేదు: దినేశ్ కార్తిక్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రోహిత్ వేముల మృతిపై విచారణలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా తెలంగాణలోని తమ ప్రభుత్వం చూస్తుందని, ఎలాంటి అవకాశాన్ని వదలదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్, కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ రోహిత్ వేముల మరణం బీజేపీ ‘‘దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని’’ పూర్తిగా బయటపెట్టిన ఘోరమైన ఘటన అని అన్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ ఈ కష్టకాలంలో రోహిత్ వేముల కుటుంబానికి అండగా నిలిచిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు క్లోజర్ రిపోర్ట్ జూన్ 2023లోనే తయారైందని ఆయన అన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాంపస్లలో కుల, మతపరమైన అఘాయిత్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. సామాజిక-ఆర్థిక వెనుకబాటు నుండి వచ్చిన విద్యార్థులెవరూ అదే దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవని కేసీ వేణుగోపాల్ అన్నారు. అంతకుముందు రోహిత్ వేముల తల్లి రాధిక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మరోసారి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!