Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohith Vemula: 2016లో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల మరణం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై హైదరాబాద్ పోలీసులు విచారణను ముగించారు. తాను దళితుడు కాదనే విషయం బయటపడుతుందనే భయంతోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డాడని కోర్టుకు పోలీసులు క్లోజర్ రిపోర్టు సమర్పించారు. అయితే, పోలీసుల విచారణను రోహిత్ వేముల తల్లి అంగీకరించలేదు. దీనిపై మరోసారి విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
READ ALSO: Dinesh Karthik: నాకు బ్యాటింగ్ వస్తుందనుకోలేదు: దినేశ్ కార్తిక్
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రోహిత్ వేముల మృతిపై విచారణలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా తెలంగాణలోని తమ ప్రభుత్వం చూస్తుందని, ఎలాంటి అవకాశాన్ని వదలదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్, కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ రోహిత్ వేముల మరణం బీజేపీ ‘‘దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని’’ పూర్తిగా బయటపెట్టిన ఘోరమైన ఘటన అని అన్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ ఈ కష్టకాలంలో రోహిత్ వేముల కుటుంబానికి అండగా నిలిచిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు క్లోజర్ రిపోర్ట్ జూన్ 2023లోనే తయారైందని ఆయన అన్నారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాంపస్లలో కుల, మతపరమైన అఘాయిత్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. సామాజిక-ఆర్థిక వెనుకబాటు నుండి వచ్చిన విద్యార్థులెవరూ అదే దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవని కేసీ వేణుగోపాల్ అన్నారు. అంతకుముందు రోహిత్ వేముల తల్లి రాధిక హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మరోసారి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!