Puja khedkar: యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా
- యూపీఎస్సీ చర్యపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
- రద్దు ఉత్తర్వులు అందలేదన్న పూజా ఖేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్.. యూపీఎస్సీ చర్యను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ తీసుకున్న చర్యలకు సంబంధించిన ఉత్తర్వులు తనకు అందలేదని విచారణ సందర్భంగా పూజా ఖేద్కర్ న్యాయస్థానానికి తెలిపింది. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా కేవలం తాను మీడియాతో ద్వారా తెలుసుకున్నట్లు ఆమె పేర్కొంది. ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దుతో పటు భవిష్యత్లో జరిగే అన్ని పరీక్షల నుంచి యూపీఎస్సీ డిబార్ చేసనట్లుగా మీడియాలో కథనాలు చూసినట్లు ఆమె ధర్మాసనానికి తెలిపింది. పూజా ఖేద్కర్ పిటిషన్ను న్యాయమూర్తి జ్యోతి సింగ్ విచారించారు.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు..
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
అయితే పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసినట్లుగా అధికారిక ఉత్తర్వుపై రెండు రోజుల్లో కమ్యూనికేట్ చేస్తామని యూపీఎస్సీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. యూపీఎస్సీ తరపున న్యాయవాది నరేష్ కౌశిక్ పేర్కొన్నారు. ఖేద్కర్ అందుబాటులో లేనందున పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా.. ఆమె స్పందించకపోవడంతో యూపీఎస్సీ చర్యలు తీసుకుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Anchor Suma : వివాదంలో యాంకర్ సుమ.. న్యాయం చేయాలంటూ వేడుకోలు!
2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పూజా ఖేద్కర్.. అక్రమంగా యూపీఎస్సీ ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెకు యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 30 వరకు అవకాశం ఇచ్చినా స్పందన రాకపోవడంతో.. జూలై 31న ఆమె అభ్యర్థిత్వాన్ని.. భవిష్యత్లో జరిగే అన్ని రకాల పరీక్షల నుంచి డిబార్ చేసినట్లుగా యూపీఎస్సీ పేర్కొంది. ఇక ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు బుక్ చేశారు. దీనిపై ఢిల్లీ కోర్టులో ముందుస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఇదిలా ఉంటే పూజా దుబాయ్ పారిపోయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: Guess the Celebrity: పవన్-రేణు దేశాయ్ పక్కన కూర్చున్న ఈ పాపను గుర్తు పట్టారా?
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!