Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!
- పూణెలో దారుణం
- యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం
- సెల్ఫీ తీసుకుని బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడొక చోట అబల దారుణానికి గురవుతూనే ఉంటోంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్శిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. యువతిపై అత్యాచారానికి తెగబడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు
Also Read
- PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
పూణెలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్న మహిళ(22) దగ్గరకు బుధవారం రాత్రి 7:30 గంటలకు కొరియర్ డెలివరీ బాయ్ వచ్చాడు. పార్శిల్ అందజేసిన తర్వాత ఓటీపీ చెప్పమని అడిగాడు. ఇంతలో మొబైల్ తెచ్చేందుకు మహిళ లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!
ఇక స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. డెలివరీ బాయ్.. తన ముఖంపై చిల్లింగ్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని.. అనంతరం తన మొబైల్ సెల్ఫీ తీసుకుని మళ్లీ వస్తానంటూ రాసినట్లు చెప్పుకొచ్చింది.
బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పేందుకు లోపలికి వెళ్లగా.. నిందితుడు లోపలికి వెళ్లి స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పారిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అత్యాచారం, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే తెలిపారు.
‘‘నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బ్యాంక్ కవరుతో ఒక డెలివరీ బాయ్.. 22 ఏళ్ల మహిళ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు. ఓటీపీ చెప్పేందుకు ఆమె లోపలికి వెళ్ళినప్పుడు.. అతడు తలుపు మూసేసి అత్యాచారం చేశాడు. క్రైమ్ బ్రాంచ్ నుంచి ఐదు జోనల్ బృందాలు, పది బృందాలు ఈ కేసుపై పనిచేస్తున్నాయి. రాత్రి 7.30 గంటల నుంచి ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉంది. తనిఖీ కోసం ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించాం. మహిళ ఫోన్లో ఒక సెల్ఫీ దొరికింది. మేము దానిని కూడా విశ్లేషిస్తున్నాము” అని రాజ్ కుమార్ షిండే చెప్పారు.
తాజావార్తలు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!