Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు
- ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు..
- పోలీసులకు సమాచారం అందించిన స్కూల్ యాజమాన్యం..
- బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు
Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు వెంటనే పాఠశాల దగ్గరకు చేరుకుని.. స్టూడెంట్స్ ను, సిబ్బందిని బయటకు పంపించారు. ఆ తర్వాత బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సహాయంతో స్కూల్ ప్రాంగణంలో పూర్తిగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులూ దొరకలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారన చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Smriti Mandhana: స్మృతీ మంధానతో రిలేషన్ను అందుకే గోప్యంగా ఉంచా: పలాష్
Also Read
అయితే, గురువారం నాడు ఢిల్లీలోని ప్రశాంత్ విహార్లో ఉన్న పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు సమీపంలో బాంబు పేలింది. దీంతో స్థానికులు, మల్టీప్లెక్స్కు వచ్చిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పీవీఆర్ మల్టీఫ్లెక్స్కు కొద్ది మీటర్ల దూరంలోనే జరిగిన ఈ ఘటనలో ఓ ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంఘటన ప్రదేశంలో తెల్లటి పౌడర్ లభ్యం కాగా.. మరిన్ని వివరాల కోసం విచారన చేపట్టామని పోలీసులు చెప్పారు.
STORY | Delhi: Private school receives bomb threat email day after low-intensity blast
READ: https://t.co/wnoJaoCdmN
VIDEO: #DelhiBlast #Rohini #prashantviharblast pic.twitter.com/t6egvw3Izn
— Press Trust of India (@PTI_News) November 29, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో