Delhi Pollution: కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. స్కూళ్ల మూసివేత.. 4 రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. దీంతో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వ చర్యలకు ఉపక్రమించింది. దేశ రాజధానిలో రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 5వ తరగతి పై తరగతులు విద్యార్థుల బహిరంగ కార్యకలాపాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాము అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధానిలో కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు స్కూళ్లను మూసివేయనున్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యం, ఢిల్లీ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ సమస్య మాత్రమే కాదని.. దేశ సమస్య అని అన్నారు. నిందలు, రాజకీయాలకు ఇది సమయం కాదని కేజ్రీవాల్ అన్నారు. వాహనాల సరి-బేసి విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 10న ఆయా రాష్ట్రాల సీఎస్ లు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!