Delhi Pollution: కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. స్కూళ్ల మూసివేత.. 4 రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. దీంతో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వ చర్యలకు ఉపక్రమించింది. దేశ రాజధానిలో రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 5వ తరగతి పై తరగతులు విద్యార్థుల బహిరంగ కార్యకలాపాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాము అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధానిలో కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు స్కూళ్లను మూసివేయనున్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Pradeep Kumar IAS: పదవీ విరమణ రోజే సీబీఐ షాక్.. ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు.. కారణం ఇదే!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
Read Also: TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యం, ఢిల్లీ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ సమస్య మాత్రమే కాదని.. దేశ సమస్య అని అన్నారు. నిందలు, రాజకీయాలకు ఇది సమయం కాదని కేజ్రీవాల్ అన్నారు. వాహనాల సరి-బేసి విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 10న ఆయా రాష్ట్రాల సీఎస్ లు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
-
Akhil Raj Incident: నాదే తప్పు.. హీరోను ఏం అనకండి.. డెలివరీ బాయ్ షాకింగ్ స్టేట్మెంట్..
-
Isakapatnam OTT: క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్లోకి ‘ఇసకపట్నం’!
-
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
-
India vs England: “బుడ్డోడా నీ ప్రతిభకు సలాం”.. కానీ నీకోసం కాటేరమ్మకొడుకును బలి చేయలేం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!