Delhi Pollution: కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. స్కూళ్ల మూసివేత.. 4 రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. దీంతో అక్కడి కేజ్రీవాల్ ప్రభుత్వ చర్యలకు ఉపక్రమించింది. దేశ రాజధానిలో రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 5వ తరగతి పై తరగతులు విద్యార్థుల బహిరంగ కార్యకలాపాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తాము అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాజధానిలో కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు స్కూళ్లను మూసివేయనున్నారు.
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
Read Also: TRS MLAs: సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారం
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యం, ఢిల్లీ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ సమస్య మాత్రమే కాదని.. దేశ సమస్య అని అన్నారు. నిందలు, రాజకీయాలకు ఇది సమయం కాదని కేజ్రీవాల్ అన్నారు. వాహనాల సరి-బేసి విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నవంబర్ 10న ఆయా రాష్ట్రాల సీఎస్ లు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!