BREAKING NEWS: అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BREAKING NEWS: ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు సిఫారసు చేశారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ స్థాపించిన ‘‘సిఖ్ ఫర్ జస్టిస్’’ సంస్థ నుంచి కేజ్రీవాల్ రాజకీయ నిధులు పొందారనే ఆరోపణల నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక విచారణ సంస్థ ఎన్ఐఏ దర్యాప్తుకు సోమవారం ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర హోం కార్యదర్శికి ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది.
Read Also: BREAKING NEWS: అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఇటీవల ఖలిస్తాన్ గ్రూపు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ 16 మిలియన్ డాలర్ల నిధులు పొందినట్లు ఉగ్రవాది పన్నూ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై ఆప్ ఇంకా స్పందించలేదు. లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న కేజ్రీవాల్కి, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇది షాకింగ్ న్యూస్. అయితే, ఆప్ మాత్రం బీజేపీ తమను ఎదుర్కోలేక రాజకీయ ప్రతీకారంతోనే కేసులు పెడుతోందని ఆరోపిస్తోంది.
2014 నుంచి 2022 మధ్య ఆప్కి ఖలిస్తాన్ గ్రూపుల నుంచి నిధులు అందాయని పన్నూ ఆరోపించారు. దేవేంద్ర పాల్ భుల్లర్ని విడుదల చేయడానికి ఈ డబ్బును ముట్టచెప్పిటనట్లు పన్నూ చెప్పారు. నిషేధిత ఉగ్రసంస్థ నుంచి ఒక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు రావడంతో దర్యాప్తు అవసరం అని సక్సేనా అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో.. జనవరి 2014లో కేజ్రీవాల్ ఇక్బాల్ సింగ్కు రాసిన లేఖలో ఆప్ ప్రభుత్వం ఇప్పటికే భుల్లర్ విడుదల కోసం రాష్ట్రపతికి సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేజ్రీవాల్ 2014లో తన న్యూయార్క్ పర్యటనలో రిచ్మండ్ హిల్స్ గురుద్వారాలో ఖలిస్తానీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖలిస్తానీ గ్రూపుల నుంచి ఆర్థిక సహాయం అందడంతో భుల్లర్ని విడుదల చేయడానికి కేజ్రీవాల్ హామీ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!