Arvind Kejriwal: ఎస్పీ అధినేత అఖిలేశ్తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన ఆయన నేడు ఎస్పీ అధినేత అఖిలేశ్తో సమావేశం కానున్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో లక్నోలో భేటీ కానున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్తో కలిసి మద్దతు కోరనున్నారు.
Read also: Naga chaitanya : ఆ సూపర్ హిట్ సినిమా ను రీ మేక్ చేయబోతున్న నాగ చైతన్య..!!
Also Read
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను రాజ్యసభలో అడ్డుకోవడంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన (యూబిటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శిబు సోరెన్తో భేటీ అయి వారి మద్ధతు కోరిన విషయం తెలిసిందే. ఇపుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్తో సమావేశం నిర్వహించనున్నారు.
Read also: RITES Recruitment 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు..నెలకు 1,40000 జీతం.. పూర్తి వివరాలు..
ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీలపై ప్రజా ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని మే 11న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇచ్చింది. అయితే మే 19న మోదీ సర్కార్ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్డినెన్స్ను రాజ్యసభలో అడ్డుకోవడానికి బీజేపీయేతర పార్టీల నాయకులను కేజ్రీవాల్ కలుస్తున్నారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని.. కేంద్ర ఆర్డినెన్స్ మూలంగా ఎన్నికైన ప్రభుత్వాలకు బ్యూరోక్రాట్లపై అధికారులు లేకుండా పోతున్నాయని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ఆర్డినెన్స్ ను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!