Delhi Municipal Election: నేడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ, ఆప్ మధ్యే తీవ్ర పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Civic Polls Today: బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కోసం అంతా సిద్ధం అయింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 250 వార్డులకు 1349 మంది పోటీలో నిలబడ్డారు. 1.45 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. భద్రత కోసం మొత్తం 70 వేల మందిని ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు 40,000 మంది, హోమ్ గార్డులు 20,000 మందిని, ఇతర సిబ్బందిని మోహరించింది. మతపరంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను ఎక్కువగా పెంచారు. 60 డ్రోన్ కెమెరాలను సున్నిత ప్రాంతాల్లో మోహరించారు. డిసెంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Read Also: Jaipur: కుమార్తెను కోచింగ్కు తీసుకెళ్తుండగా గ్యాంగ్ స్టర్ కాల్పులు.. తండ్రి మృతి
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
గత 24 ఏళ్లుగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పై గట్టి పట్టునిలుపుకుంది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ 70 స్థానాలకు గానూ 67 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత రెండేళ్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 272 సీట్లలో 181 గెలిచి ఢిల్లీ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఆప్ 48, కాంగ్రెస్ 30 స్థానాలను గెలుచుకుంది.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను బీజేపీ, ఆప్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉండనుంది. కాంగ్రెస్ ఉన్నా కూడా నామమాత్రపు పోటీని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా ఇటు బీజేపీ, అటు ఆప్ రెండు పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. మరోసారి ఎలాగైనా బీజేపీ ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అనుకుంటోంది. గత రెండు నెలల నుంచి ఇరు పార్టీలు కూడా ఢిల్లీ నగరంలో విస్తృతంగా ప్రచారం చేశాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..