Justice Sanjiv Khanna: ఢిల్లీలో వాయు కాలుష్యం.. వర్చువల్గా కేసుల విచారణ
- దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం..
- వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని సీజేఐ సూచన..
- ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్గా పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చు: సీజేఐ సంజీవ్ ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Sanjiv Khanna: దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని ఆదేశించారు. కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
Also Read
ఇక, జీఆర్పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని న్యాయస్థానాలు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకర నారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించ వచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..
కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు. ఈరోజు (మంగళవారం) సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కు పడిపోగా.. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ను దాటిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్ పై మండిపడింది. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!