Justice Sanjiv Khanna: ఢిల్లీలో వాయు కాలుష్యం.. వర్చువల్గా కేసుల విచారణ
- దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం..
- వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని సీజేఐ సూచన..
- ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్గా పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చు: సీజేఐ సంజీవ్ ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Sanjiv Khanna: దేశ రాజధానిలో ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో వీలైతే జడ్జీలు వర్చువల్గా కేసుల విచారణ చేయాలని ఆదేశించారు. కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానంలో ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
Also Read
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bhojshala case: "భోజ్శాల ఒక దేవాలయం".. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ఇక, జీఆర్పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని న్యాయస్థానాలు పూర్తిగా వర్చువల్ విధానాన్ని అనుసరించాలని న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకర నారాయణన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్ మోడ్లో పాల్గొని తమ వాదనలు వినిపించ వచ్చని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..
కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతుంది.. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు. ఈరోజు (మంగళవారం) సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494కు పడిపోగా.. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్ను దాటిందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. దీని వల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. వాయు కాలుష్యంపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఢిల్లీ సర్కార్ పై మండిపడింది. కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే ఒకటి నుంచి 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!