Mumbai Court: “బ్రేకప్” తర్వాత ప్రియుడి ఆత్మహత్య.. సంచలన తీర్పు చెప్పిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్నర్లను మార్చడం “నైతికం”గా సరికాదు, కానీ రిలేషన్షిప్లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.
అదనపు సెషన్స్ జడ్జ్ ఎన్పీ మెహతా ఫిబ్రవరి 29న ఈ కేసును విచారించారు. నితిన్ కేసీ అనే వ్యక్తి ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న మనీషా చూడసమా, ఆమెకు కాబోయే భర్త రాజేష్ పన్వార్లను నిర్దోషులుగా విడుదల చేశారు. నితిన్ కేసీ జనవరి 15, 2016న తన ఇంట్లో ఉరేసుకుని కనిపించాడు, వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మనీషా ముందుగా నితిన్ కేనీతో రిలేషన్షిప్లో ఉండేది. కానీ ఆమె కేనీకి బ్రేకప్ చెప్పి రాజేష్ పన్వార్తో నిశ్చితార్థం చేసుకుంది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురైన నితిన్ కేనీ ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
Also Read
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
Read Also: UK: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి విద్వేష మత బోధకులు రాకుండా బ్యాన్.. యూకే కీలక నిర్ణయం..
మనీషా, రాజేష్లు కోనిని మానసికంగా హింసించి, ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ప్రాసిక్యూషన్ వాదించారు. మరోవైపు మనీషాను నితిన్ కేనీ వెంబడించాడని, ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని డిఫెన్స్ వాదించింది. అయితే, బాధితుడు నితిన్, మనీషా-రాహుల్ రిలేషన్లో ఉన్నారని తెలుసుకుని కలత చెందినట్లు కనిపిస్తోందని, ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిందని తెలసుకుని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనే విపరీత చర్య తీసుకున్నట్లు భావిస్తున్నట్లు కోర్టు చెప్పింది.
నైతికంగా ఒకరి ఇష్టానుసారం ప్రేమ భాగస్వామిని మార్చడం సరికాదు, కానీ బాధితుడి ప్రేయసి/ప్రేమికుడు తన పార్ట్నర్ని మార్చుకుని వేరే వారితో రిలేషన్ కొనసాగిస్తే, శిక్షా చట్టంలోని నిబంధనలను చూస్తే, బాధితుడికి ఎటువంటి పరిహారం ఉండదని న్యాయమూర్తి చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 ప్రకారం బాధితుడిని ఆత్మహత్యకు ప్రేరేపించాలంటే, నిందితుడి వైపు నుంచి చురుకైన ప్రేరణ, ప్రోత్సాహం ఉండాలని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రేమించే భాగస్వామి ఎలాంటి కారణం లేదకుండా బ్రేకప్ చెబితే, ఆ వ్యక్తి మానసికంగా దెబ్బతింటాడు, ప్రేమ సంబంధం విఫలం కావడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే, అతని కేసులు IPC 306 ప్రకారం సెక్షన్ 107 కింద నమోదు చేయరు అని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..