కరోనా కట్టడి కోసం దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చింది భారత్.. రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చింది.. స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ సింగిల్ డోసు టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా.
Read Also: పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీ.. ఇలా స్పందించిన సిధ్ధూ..
భారత్ విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చిన తర్వాత రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్లో పంపిణీ చేస్తున్నారు.. 2021 జూన్ నుంచే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ను పంపిణీ జరుగుతోంది.. ఇప్పుడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ కు అనుమతి లభించింది.. సింగిల్-డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం వచ్చింది.. కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.. ఇది దేశంలో 9వ కోవిడ్ వ్యాక్సిన్.. ఇది మహమ్మారిపై దేశం యొక్క సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు మన్సుఖ్ మాండవియా. కాగా, గత ఏడాది జూలై 1న, స్పుత్నిక్ లైట్కు అనుమతి ఇవ్వడానికి భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ నిరాకరించింది.