పైలెట్ సీట్లో బీజేపీ ఎంపీ, ప్రయాణికుడిగా డీఎంకే ఎంపీ.. మారన్ ఆనందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. ఓ ఎంపీ పైలట్గా మారి విమానాన్ని గాల్లో ఎగిరిస్తే.. మరో ఎంపీ ప్రయాణికుడికిగా అతడితో పాటు ప్రయాణం చేశారు.. అయితే, ఇద్దరూ సుపరిచితులు కావడంతో.. వారి పలకరింపులు, ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యానికి గురికావడం ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో.. ఆ అరుదైన ఘటన అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డీఎంకే సీనియర్ ఎంపీ దయానిధి మారన్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ గత శుక్రవారం ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నారు. విమానంలో ముందు వరుసలో ఉన్న సీట్లో కూర్చొన్నారు మారన్… అంతలోనే మీరు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారా? అని ఓ గొంతు ఆయనను పలకరించింది. మారన్ వెనక్కి తిరిగి చూడగానే ప్లైట్ కెప్టెన్ యూనిఫామ్ లో ఓ వ్యక్తి కనిపించారు. మాస్క్ కూడా వేసుకుని ఉండటంతో మొదట గుర్తుపట్టని మారన్.. తర్వాత మాత్రం గొంతు విని తన సహచర ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు మారన్..
సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రూడీ.. విమానానికి తరచుగా కెప్టెన్గా చేస్తారు.. నేను చాలాకాలం దీని గురించి మాట్లాడుతునానని ఖచ్చితంగా తెలుసు. ఢిల్లీ నుంచి చెన్నైకి మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చినందుకు ఎంపీ కెప్టెన్ రాజీవ్ ప్రతాప్ రూడీకి ధన్యవాదాలు.. నా మంచి స్నేహితుడుతో నేను విమానంలో వచ్చినందకు నేను గౌరవించబడ్డానని మాత్రం చెప్పగలను.. అంటూ ట్వీట్ చేశారు.. కాగా, మాజీ పౌర విమానయాన మంత్రి అయిన రూడీ… బీహార్కు చెందిన లోక్సభ ఎంపి, బిజెపి జాతీయ ప్రతినిధి. మారన్ తండ్రి మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య మంత్రిగా ఉన్నప్పుడు రూడీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.
Also Read
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
A Flight to remember.
July 13, 2021I boarded the Indigo flight 6E864 from Delhi to Chennai after attending a meeting of the parliamentary Estimates Committee. I happened to sit in the first row, as the crew declared that the boarding had completed.
1/7 pic.twitter.com/pwfsW39fDC
— Dayanidhi Maran தயாநிதி மாறன் (@Dayanidhi_Maran) July 13, 2021
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!