Dawood Ibrahim: కరాచీ ఎయిర్పోర్టును ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్.. ఎన్ఐఏ సంచలన రిపోర్ట్
Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్ పోర్టును దావూద్ ఇబ్రహీం ఏలుతున్నాడని.. అక్కడ డీ-కంపెనీ మాఫియాకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్ఐఏ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్టులో వీరందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తేలింది.
Read Also: Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
కరాచీ ఎయిర్ పోర్టు కేంద్రంగా దావూద్ అక్రమదందా సాగుతోందని ఎన్ఐఏ తేల్చింది. ఎయిర్ పోర్టులో చెక్-ఇన్, చెక్-అవుట్ సమయంలో ప్రత్యేక అధికారుల ఉంటున్నాయని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దావూద్ తో పాటు ఛోటా షకీర్ ఉగ్రవాదులకు కరాచీ ఎయిర్ పోర్టులో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపింది. 1993 ముంబైలో వరసగా 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. అప్పటి నుంచి పాకిస్తాన్ లో రక్షణ పొందుతున్నాడు.
ఇదిలా ఉంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పఠాన్ కు చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ విచారణలో ఎన్ఐఏ అధికారులకు ఈ విషయం వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడనేది అబద్ధం అని వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో సహా పాకిస్థాన్లోని కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనుక రక్షణ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్య మైజాబిన్. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మొదటి కుమార్తె మారుఖ్ ను ప్రముఖ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. మరో కుమార్తెతో పాటు కుమారుడికి కూడా వివాహం అయింది.
తాజావార్తలు
-
PBKS vs RR: పంజాబ్ కింగ్స్కి అగ్నిపరీక్ష.. టాస్ గెలిచిన రాజస్థాన్! జట్టును రక్షించే బాధ్యత శ్రేయస్ అయ్యర్దే!
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో