Dawood Ibrahim: కరాచీ ఎయిర్పోర్టును ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్.. ఎన్ఐఏ సంచలన రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్ పోర్టును దావూద్ ఇబ్రహీం ఏలుతున్నాడని.. అక్కడ డీ-కంపెనీ మాఫియాకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్ఐఏ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్టులో వీరందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తేలింది.
Read Also: Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
కరాచీ ఎయిర్ పోర్టు కేంద్రంగా దావూద్ అక్రమదందా సాగుతోందని ఎన్ఐఏ తేల్చింది. ఎయిర్ పోర్టులో చెక్-ఇన్, చెక్-అవుట్ సమయంలో ప్రత్యేక అధికారుల ఉంటున్నాయని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దావూద్ తో పాటు ఛోటా షకీర్ ఉగ్రవాదులకు కరాచీ ఎయిర్ పోర్టులో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపింది. 1993 ముంబైలో వరసగా 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. అప్పటి నుంచి పాకిస్తాన్ లో రక్షణ పొందుతున్నాడు.
ఇదిలా ఉంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పఠాన్ కు చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ విచారణలో ఎన్ఐఏ అధికారులకు ఈ విషయం వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడనేది అబద్ధం అని వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో సహా పాకిస్థాన్లోని కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనుక రక్షణ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్య మైజాబిన్. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మొదటి కుమార్తె మారుఖ్ ను ప్రముఖ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. మరో కుమార్తెతో పాటు కుమారుడికి కూడా వివాహం అయింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!