Darshan Case: దర్శన్ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..
- కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..
- తనను బెంగళూర్ జైలుకు మార్చాలని కోరిన దర్శన్..
- నిద్రలో గట్టి కేకలు వేస్తూ కలవరపడుతున్నట్లు చెబుతున్న తోటి ఖైదీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతని అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Zomato: భార్యతో కలిసి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో సీఈవో గోయల్
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- DK Shivakumar: నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.. దేవాలయాల్లో పూజలు, వీవీఐపీలకు ప్రత్యేక ఆహ్వానాలు!
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ముందుగా బెంగళూర్లోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్కి రిమాండ్ విధించారు. అయితే, ఆ జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతని బళ్లారి జైలుకు తరలించారు. ఈ జైలుకు తరలించినప్పటి నుంచి దర్శన్ని రేణుకాస్వామి ఆత్మ భయపెడుతోందని జైలు సిబ్బందికి చెబుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి భయపెడుతోందని జైలులో ఉన్న ఖైదీలతో దర్శన్ చెబుతున్నాడట. భయంతో తనకు నిద్ర పట్టడం లేదని చెప్పినట్లు సమాచారం. తనను బెంగళూర్ జైలుకి తరలించాలని జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నట్లు ఖైదీలు చెబుతున్నారు.
రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ తీసుకువచ్చి అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపారు నిందితులు. తనను వదిలేయాలని ప్రాధేయపడినప్పటికీ విడిచిపెట్టలేదని తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకా స్వామి ఒంటిపై 39 గాయలు ఉన్నాయి. తలపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ప్రైవేట్ భాగాలకు ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారని, పదేపదే షాక్ ఇవ్వడం వల్ల వృషణాల్లలో ఒకటి బాగా దెబ్బతిన్నట్లు నివేదిక చెప్పింది.
తాజావార్తలు
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!