Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Dalai Lamas Escape From Tibet In 1959 How He Fled To India After Chinese Threat

Dalai Lama: ఎలా చైనా జనరల్ ఆహ్వానం, దలైలామా భారత్ పారిపోయి వచ్చేలా చేసింది..?

Published Date :July 6, 2025 , 6:56 pm
By BV Reddy
  • చైనా జనరల్ అనుమానాస్పద ఆహ్వానం..
  • భారత్ పారిపోయి వచ్చిన దలైలామా..
  • దలైలామా టిబెట్ వదిలేలా చేసిన డ్రాగన్ కంట్రీ..
Dalai Lama: ఎలా చైనా జనరల్ ఆహ్వానం, దలైలామా భారత్ పారిపోయి వచ్చేలా చేసింది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వ్యవహారం ఇప్పుడు భారత్-చైనాల మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా వారసుడు చైనా సార్వభౌమాధికారానికి చట్టానికి లోబడి ఉండాలని ఆ దేశం చెప్పింది. అయితే, దలైలామా వారసుడుని ఆయన మాత్రమే నిర్ణయించే హక్కు ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ విషయంపై చైనా స్పందిస్తూ, దలైలామా వ్యవహారంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది.

ఇదిలా ఉంటే, 6 దశాబ్ధాల క్రితం చైనా నుంచి దలైలామా ఎలా పారిపోయి వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 23 ఏళ్ల సన్యాసి తన రాజభవనం నుంచి నిశ్శబ్ధంగా సరిహద్దులు దాటి, తన అనుచర గణంతో భారత్ చేరారు. అప్పటి నుంచి భారత్‌లోనే 14వ దలైలామా ఆశ్రయం పొందుతున్నారు. ఇలా ఆశ్రయం కల్పించడం కూడా భారత్-చైనాల మధ్య వివాదానికి కారణమైంది.

Read Also: Falcon Group Scam: ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్ అరెస్ట్.. రూ.792 కోట్లకు టోకరా..

చైనా జనరల్ ఆహ్వానంతో అనుమానం:

దలైలామా తప్పించుకోవడానికి కీలక కారణం, ఓ చైనీస్ జనరల్ ఆయనను ఆహ్వానించడమే. నిజానికి 1950లో టిబెట్‌ని చైనా ఆక్రమించిన తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), టిబెటన్ ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 1951లో టిబెట్-చైనా మధ్య 17 పాయింట్ ఒప్పందం జరిగింది. చైనా సార్వభౌమాధికారం కింద టిబెట్‌కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, చైనా దీనిని ఉల్లంఘిస్తూ వచ్చింది.

ఈ క్రమంలో ఓ చైనా జనరల్ దలైలామాను సైనిక ప్రధాన కార్యాలయానికి ఒక డ్యాన్స్ ప్రదర్శనకు ఆహ్వానించారు. అయితే, బాడీగార్డ్స్ లేకుండా రావాలనే షరతు విధించారు. దీంతో, టిబెట్ నాయకత్వంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. చైనా దలైలామాను చంపడానికి లేదా కిడ్నాప్ చేయడానికి కుట్ర చేస్తుందని భావించారు. మార్చి 10, 1959న, లక్షలాది మంది టిబెటన్లు దలైలామాను రక్షించడానికి నార్బులింకా ప్యాలెస్ చుట్టూ మానవ బారికేడ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో చైనా సైనికులు, టిబెటన్ రెబల్స్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. దీంతో దలైలామా పారిపోవాల్సి వచ్చింది. మార్చి 17, 1959లో ఆర్మీ యూనిఫాం ధరించి, దలైలామా నార్బులింగకా నుండి తప్పించుకున్నారు. హిమాలయాల గుండా ప్రయాణిస్తూ, చైనా గస్తీని తప్పించుకుంటూ 13 రోజుల తర్వాత, మార్చి 31, 1959న, దలైలామా మరియు అతని పరివారం ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖెంజిమనే పాస్ వద్ద మెక్‌మహాన్ లైన్‌ను దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. బౌద్ధ సన్యాసుల ప్రార్థనల వల్లే దలైలామా చైనాకు చిక్కకుండా తప్పించుకున్నారని ఇప్పటికీ ఆయన అనుచరులు చెప్పుకుంటారు.

భారత సరిహద్దుల్లోకి రాగానే వారిని అస్సాం రైఫిల్స్ కు చెందిన భారత సైనికులు కలిశారు. మరుసటి రోజు భారత అధికారులు చుటాంగ్ము అవుట్ పోస్ట్ వద్ద అధికారికంగా ఆయనను స్వాగతించారు. ఆ తర్వాత తవాంగ్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఏప్రిల్ 3న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దలైలామాకు మానవత దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దలైలామా మొదట ముస్సోరీలో స్థిరపడ్డారు, తరువాత 1960లో ధర్మశాలలోని మెక్లియోడ్‌గంజ్‌కు వెళ్లారు, దీనిని ఇప్పుడు “లిటిల్ లాసా” అని పిలుస్తారు. అక్కడ, ఆయన ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. పాఠశాలలు, మఠాలు స్థాపించారు. 1989లో అహింసకు నిబద్ధతగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 90 ఏళ్ల వయసులో ఆయన ధర్మశాలలో నివసిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chinese Occupation
  • Dalai Lama.
  • Dharamshala
  • Humanitarian Asylum
  • india-china relations

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions