PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
- రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
- హిందువులను అవమానించడం ఫ్యాషన్ అయింది..
- అరాచకవాదులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు లోక్సభలో విరుచుకుపడ్డారు.హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా.. ఇదేనా మీ సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని, హిందువులపై కించపరచడం ఫ్యాషన్గా మారిందని దుయ్యబట్టారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. వీటిని సహించేది లేదని చెప్పారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరాచాలని కాంగ్రెస్ యత్నించిందని అన్నారు. హిందువులు సహనజీవులు అని అన్నారు. దీని వల్లే భారత్ ప్రజాస్వామ్యం, వైవిధ్యం కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్లో శివుడి పోస్టర్ని రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై మాట్లాడుతూ.. శివుడి రూపం పూజించడానికని, ప్రదర్శించడానికి కాదని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
హిందువులపై రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని ప్రధాని కోరారు. కాంగ్రెస్ మిత్రులు హిందూ మతాన్ని మలేరియాలో పోలిస్తే చప్పట్లు కోడుతున్నారని పరోక్షంగా డీఎంకేని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చెప్పేవి అన్ని అబద్ధాలే అని అన్నారు. రిజర్వేషన్లు, అగ్నివీర్, ఎంఎస్పీ, అకౌంట్లలో రూ. 8500 అన్ని అబద్ధాలని చెప్పారు. నెహ్రూ దళితులు, వెనకబడిన వారికి అన్యాయం చేశారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ని దళితుడనే వివక్షతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ది అభయహస్తం కాదని అరాచక హస్తమని చెప్పారు. జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్, సీతారం కేసరిని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పారు. అగ్నివీర్పై అబద్ధాలు ప్రచారం చేసి మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!