PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
- రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
- హిందువులను అవమానించడం ఫ్యాషన్ అయింది..
- అరాచకవాదులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు లోక్సభలో విరుచుకుపడ్డారు.హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా.. ఇదేనా మీ సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని, హిందువులపై కించపరచడం ఫ్యాషన్గా మారిందని దుయ్యబట్టారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. వీటిని సహించేది లేదని చెప్పారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరాచాలని కాంగ్రెస్ యత్నించిందని అన్నారు. హిందువులు సహనజీవులు అని అన్నారు. దీని వల్లే భారత్ ప్రజాస్వామ్యం, వైవిధ్యం కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్లో శివుడి పోస్టర్ని రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై మాట్లాడుతూ.. శివుడి రూపం పూజించడానికని, ప్రదర్శించడానికి కాదని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
హిందువులపై రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని ప్రధాని కోరారు. కాంగ్రెస్ మిత్రులు హిందూ మతాన్ని మలేరియాలో పోలిస్తే చప్పట్లు కోడుతున్నారని పరోక్షంగా డీఎంకేని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చెప్పేవి అన్ని అబద్ధాలే అని అన్నారు. రిజర్వేషన్లు, అగ్నివీర్, ఎంఎస్పీ, అకౌంట్లలో రూ. 8500 అన్ని అబద్ధాలని చెప్పారు. నెహ్రూ దళితులు, వెనకబడిన వారికి అన్యాయం చేశారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ని దళితుడనే వివక్షతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ది అభయహస్తం కాదని అరాచక హస్తమని చెప్పారు. జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్, సీతారం కేసరిని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పారు. అగ్నివీర్పై అబద్ధాలు ప్రచారం చేసి మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!