PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
- రాహుల్ గాంధీ ‘హిందూ’ వ్యాఖ్యలపై పీఎం మోడీ ఫైర్..
- హిందువులను అవమానించడం ఫ్యాషన్ అయింది..
- అరాచకవాదులుగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM MODI: రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు లోక్సభలో విరుచుకుపడ్డారు.హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా.. ఇదేనా మీ సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని, హిందువులపై కించపరచడం ఫ్యాషన్గా మారిందని దుయ్యబట్టారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. వీటిని సహించేది లేదని చెప్పారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరాచాలని కాంగ్రెస్ యత్నించిందని అన్నారు. హిందువులు సహనజీవులు అని అన్నారు. దీని వల్లే భారత్ ప్రజాస్వామ్యం, వైవిధ్యం కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్లో శివుడి పోస్టర్ని రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై మాట్లాడుతూ.. శివుడి రూపం పూజించడానికని, ప్రదర్శించడానికి కాదని ప్రధాని మోడీ అన్నారు.
Read Also: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..
Also Read
- Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
- Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
- Yogi Adityanath: మీరు నేర్పుతారా, మమ్మల్ని నేర్పించమంటారా.? అఖిలేష్కు సీఎం యోగి వార్నింగ్..
- Rahul Gandhi: ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికలు మనవే.. కానీ ఎన్నికలు సజావుగా జరగవు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
హిందువులపై రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని ప్రధాని కోరారు. కాంగ్రెస్ మిత్రులు హిందూ మతాన్ని మలేరియాలో పోలిస్తే చప్పట్లు కోడుతున్నారని పరోక్షంగా డీఎంకేని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చెప్పేవి అన్ని అబద్ధాలే అని అన్నారు. రిజర్వేషన్లు, అగ్నివీర్, ఎంఎస్పీ, అకౌంట్లలో రూ. 8500 అన్ని అబద్ధాలని చెప్పారు. నెహ్రూ దళితులు, వెనకబడిన వారికి అన్యాయం చేశారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ని దళితుడనే వివక్షతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్ది అభయహస్తం కాదని అరాచక హస్తమని చెప్పారు. జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్, సీతారం కేసరిని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పారు. అగ్నివీర్పై అబద్ధాలు ప్రచారం చేసి మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Ragi Halwa: ముప్పై దాటిన మహిళల హెల్త్ కోసం బెస్ట్ స్వీట్.. రాగి పిండితో నోరూరించే హెల్దీ హల్వా!
-
IND vs AFG: ధర్మశాలలో గుర్బాజ్ సెంచరీతో విశ్వరూపం.. ఒకే ఇన్నింగ్స్తో భారత్పై బద్దలైన రికార్డులు…
-
Jaishankar-Rubio: హార్ముజ్లో అమెరికా ఆదేశాలు పాటించాల్సిందే.. జైశంకర్కు రూబియో సూచన
-
Maharashtra Politics: మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ కలకలం.. షిండే గూటికి ఉద్ధవ్ ఎంపీలు జంప్! మాతోశ్రీలో అర్జెంట్ మీటింగ్..
-
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్డే.. వైట్హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!