COVID 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 44 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,216 మంది మహమ్మారిని జయించారు.
దేశంలో కోవిడ్ మొదలైన రెండున్నర ఏళ్లలో 4,39,59,321 మందికి కరోనా సోకింది. వీరిలో ఇప్పటి వరకు 5,26,211 మంది చనిపోయారు. 4,32,86,787 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల శాతం 1.20గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేస్ లోడ్ 1,297 కేసులకు పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.71గా ఉంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Mamata Banerjee: మంత్రి పార్థ ఛటర్జీ కేసు.. మీడియాపై దీదీ ఆగ్రహం
కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో చోటు చేసుకున్న మరణాల్లో కూడా ఈ రాష్ట్రాల నుంచే ఎక్కవ మంది చనిపోయారు. కేరళలో 12 మంది, మహారాష్ట్రలో 8 మంది, బెంగాల్లో 5 మంది, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడి మరణించారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?