UP Driver: 28 ఏళ్ల తరువాత కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Driver: సినిమాల్లోనూ.. రాజకీయ నాయకులు తరచుగా చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎంటదని బుర్ర గోక్కుంటున్నారా? అదేనండీ చట్టం తన పని తాను చేసుకు పోతుంది.. చట్టం ముందు అందరూ సమానమే. ఈ డైలాగ్ గుర్తొ్చ్చింది కదా.. ఈ ఘటనను చూస్తే అది నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం అతను డ్రైవర్గా ఉన్నప్పుడు జరిగిన ఘటనపై ఇప్పుడు ఆయన 83 ఏళ్ల వయసులో కోర్టు సమన్లు జారీ చేసింది. అందుకే అంటున్నాం.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో 1994లో జరిగింది. అపుడు అతను రెండు సార్లు కోర్టుకు వెళ్లి వచ్చాడు.. తరువాత దాని గురించి చడీ చప్పుడు లేదు. 28 సంవత్సరాల తరువాత ఇపుడు కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు..
Read also: Tamannah : రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతున్న తమన్నా..
Also Read
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ఉత్తరప్రదేశ్కు చెందిన 83 ఏళ్ల అచ్చన్ రెండు దశాబ్దాల క్రితం డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం అతను పక్షవాతంతో బాధపడుతున్నాడు. సోమవారం ఆయనకు అనుకోకుండా సమన్లు వచ్చాయి. బరేలీ పోలీసుల బృందం అతని బారాబంకి ఇంటికి చేరుకుని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుండి సమన్లు అందజేశారు. షాక్ తిన్న అచ్చన్ పోలీసులపై విరుచుకుపడ్డాడు. అచ్చన్ స్పందనకు ఎలా స్పందించాలో అర్థంకాని పోలీసులు వృద్ధుడిని కోర్టుకు హాజరుకావాలని కోరారు. లేని పక్షంలో చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Read also: BMW M 1000 RR Launch: 55 లక్షల విలువైన సరికొత్త బైక్.. గరిష్ట వేగం గంటకు 314 కిమీ!
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అచ్చన్ చెబుతూ 1994లో జరిగిన సంఘటనను చెప్పాడు. అచ్చన్ తాను ఉత్తరప్రదేశ్ రవాణా శాఖలో డ్రైవర్గా పనిచేశానని చెప్పాడు. తాను సరుకు తీసుకురావడానికి బరేలీకి వెళ్ళానని… అక్కడి నుండి ఫరీద్పూర్కి వెళ్ళానని చెప్పాడు. తాను రాత్రి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గేదెల బండి ఒక్కసారిగా మలుపు తిరిగింది. బ్రేకులు పనిచేయలేదు మరియు క్రాష్ అయి గేదె చనిపోయిందని చెప్పాడు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఫరీద్పూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు సమాచారం అందించానని ఆయన చెప్పాడు. ఘటన అనంతరం తనకు రెండు పర్యాయాలు సమన్లు అందాయని.. ఆ రెండు సందర్భాల్లో బెయిల్ పొందానని అచ్చన్ చెప్పారు. రెండు దశాబ్దాల తరువాత ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుందని.. ఇప్పుడు కోర్టుకు హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసిందని అచ్చన్ చెప్పారు.
తాజావార్తలు
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!