India vs Canada: మన ప్రయోజనాలే ముఖ్యం.. మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Canada: ఖలిస్తానీ వేర్పాటువాదానికి మద్దతు నిలుస్తున్న కెనడా తీరుపై భారతదేశం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇదిలా ఉంటే కెనడా పౌరుడు, ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం, ఆ దేశ విదేశాంగ మంత్రి భారత అత్యున్నత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే కెనడా వాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. ఇండియాలో కెనడా రాయబారిని భారతవిదేశాంగ పిలిచి, కెనడా నిర్ణయంపై తీవ్రంగా ఆక్షేపించింది.
Read Also: Sonia Gandhi: “ఈ బిల్లు మాదే”.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ..
Also Read
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
- Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ఇదిలా ఉంటే ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దేశప్రయోజనాలు, ఆందోళలకే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. ‘‘ఉగ్రవాదంపై మన దేశం యొక్క పోరాటం రాజీపడదని భారత జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రత్యేకించి ఉగ్రవాదం భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నప్పుడు, మన దేశ ప్రయోజనాలు, ఆందోళనలు అన్ని వేళలా ముఖ్యమైనవిగా ఉండాలి’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. దేశ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంతో విభేదించినప్పటికీ, అంతర్జాతీయ సమస్యలపై మద్దతు ఉంటుందని కాంగ్రెస్ తెలిపింది.
జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే దీనిపై అక్కడి ఖలిస్తాన్ వేర్పాటువాదులు, రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ భారత్ దేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం, భారత వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం, కెనడాను పలుమార్లు కోరింది. అయినా ట్రూడో ప్రభుత్వం దీనిపై మెతక వైఖరి అవలంభిస్తోంది. ఇటీవల జీ20 సమావేశాలకు ట్రూడో భారత్ వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ తన ఆందోళనను తెలియజేశారు. ఈ పర్యటన అనంతరం కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది.
తాజావార్తలు
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
-
Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
-
Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!