India vs Canada: మన ప్రయోజనాలే ముఖ్యం.. మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Canada: ఖలిస్తానీ వేర్పాటువాదానికి మద్దతు నిలుస్తున్న కెనడా తీరుపై భారతదేశం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. ఇదిలా ఉంటే కెనడా పౌరుడు, ఖలిస్తానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించడం, ఆ దేశ విదేశాంగ మంత్రి భారత అత్యున్నత దౌత్యవేత్తను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇప్పటికే కెనడా వాదనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపించింది. ఇండియాలో కెనడా రాయబారిని భారతవిదేశాంగ పిలిచి, కెనడా నిర్ణయంపై తీవ్రంగా ఆక్షేపించింది.
Read Also: Sonia Gandhi: “ఈ బిల్లు మాదే”.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ..
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ఇదిలా ఉంటే ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు తెలిపింది. దేశప్రయోజనాలు, ఆందోళలకే ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ జైరాం రమేష్ అన్నారు. ‘‘ఉగ్రవాదంపై మన దేశం యొక్క పోరాటం రాజీపడదని భారత జాతీయ కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రత్యేకించి ఉగ్రవాదం భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతకు ముప్పు కలిగిస్తున్నప్పుడు, మన దేశ ప్రయోజనాలు, ఆందోళనలు అన్ని వేళలా ముఖ్యమైనవిగా ఉండాలి’’ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. దేశ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంతో విభేదించినప్పటికీ, అంతర్జాతీయ సమస్యలపై మద్దతు ఉంటుందని కాంగ్రెస్ తెలిపింది.
జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే దీనిపై అక్కడి ఖలిస్తాన్ వేర్పాటువాదులు, రాడికల్ సిక్కు ఎలిమెంట్స్ భారత్ దేశంపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదం, భారత వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం, కెనడాను పలుమార్లు కోరింది. అయినా ట్రూడో ప్రభుత్వం దీనిపై మెతక వైఖరి అవలంభిస్తోంది. ఇటీవల జీ20 సమావేశాలకు ట్రూడో భారత్ వచ్చినప్పుడు కూడా ప్రధాని మోదీ తన ఆందోళనను తెలియజేశారు. ఈ పర్యటన అనంతరం కెనడా, భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!