Ajit Pawar: నోరు విప్పిన అజిత్ పవార్.. అందుకే బీజేపీ కూటమిలో చేరాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడి కొడుకు, కీలక నేత అజిత్ పవార్ బీజేపీ-ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వంలో చేరారు. ఓ వైపు శరద్ పవార్, బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఇది జరిగింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే మంత్రి వర్గంలో చేరారు. ఆయనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
Read Also: Mayawati: “యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
Also Read
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని అజిత్ పవార్ చెప్పారు. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని.. ఆయన నాయకత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రయత్నంలో పాలుపంచుకోవడానికే ఈ బీజేపీతో చేతులు కలిపానని అన్నారు. ఈ రోజు ఎన్సీపీ నేతలు ప్రమాణ స్వీకారం చేశారని.. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీలో చేస్తామని అజిత్ పవార్ స్పష్టం చేశారు.
కేంద్రంలో బలమైన నాయకత్వం కావాలి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మహారాష్ట్రలో అభివృద్ధి తన ప్రాధాన్యతన అని విలేకరుల సమావేశంలో అజిత్ పవార్ చెప్పారు. మొత్తం ఎన్సీపీ బీజేపీతో చేరిందని అజిత్ పవార్ వెల్లడించారు. దేశాన్ని ంముందకు తీసుకెళ్లే ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని ఆయన ఆరోపించారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఉంటే 40కి పైగా ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!