Mayawati: “యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదు, కానీ”.. మాయావతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayawati: దేశవ్యాప్తంగా ‘యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)’పై చర్చ నడుస్తోంది. గత వారం ప్రధాని నరేంద్రమోడీ భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో యూసీసీ అమలుపై కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశంలోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు దీనిపై కామెంట్స్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన వంటి పార్టీలు దీనికి మద్దతు తెలిపుతున్నాయి. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం మాయవతి కూడా తాను యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని అమలు చేస్తున్న పద్ధతే సరిగ్గా లేదని ఆమె ఆరోపించారు.
Read Also: Manikrao Thakre: బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కయ్యింది.. మాణిక్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
యూసీసీని బీజేపీ అమలు చేసే విధానాన్ని సమర్థించమని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ సూచిస్తున్నప్పటికీ.. దాన్ని తప్పకుండా విధించాలనే నిబంధన లేదని ఆమె అన్నారు. ఏకాభిప్రాయం ద్వారా మాత్రమే దీన్ని అమలు చేయాలని ఆమె సూచించారు. అయితే ఇది ఏకాభిప్రాయంతో జరగడం లేదని.. యూసీసీ ముసుగులో సంకుచిత రాజకీయాలకు పాల్పడటం దేశానికి ప్రయోజనం కాదని.. ఇప్పుడు అదే జరుగుతోందని ఆమె దుయ్యబలట్టారు. బీఎస్పీ పార్టీ యూసీసీకి వ్యతిరేకం కాదని.. దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న విధానానికి మాత్రమే మేం వ్యతిరేకం అని అన్నారు.
ఇటీవల భోపాల్ సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ.. యూసీసీపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్దారు. భారత రాజ్యాంగం పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని సూచించిందని ఆయన అన్నారు. దేశం రెండు చట్టాలపై నడవదని అన్నారు. సుప్రీంకోర్టు కూడా యూసీసీని సమర్దించిందని ఆయన గుర్తు చేశారు. మరోవైపు పలు ముస్లిం సంఘాలు, సిక్క సంఘాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!