Congress: వెనిజులా లాగే ట్రంప్ ప్రధాని మోడీని కిడ్నాప్ చేస్తారా.? మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- వెనిజులా లాగే భారత్కు కావచ్చు..
- మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress:వెనుజులా సంక్షోభంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మౌనంగా ఉందని కాంగ్రెస్ తన దాడిని తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికైన అధ్యక్షుడిని బలవంతంగా తొలగించారని, అయినా భారత్ మౌనంగా ఉందని ఆరోపించింది. సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ వెనిజులాలో జరుగుతున్న పరిణామాలు “ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధం” అని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రపంచానికి చెడు సంకేతాన్ని అందిస్తాయని హెచ్చరించారు.
Read Also: Bhagavanth Kesari Trends: జననాయకుడి దెబ్బకి బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రేండింగ్ లోకి..!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
‘‘వెనిజులాలో జరిగింది UN చార్టర్కు విరుద్ధం. ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. రేపు మరే ఇతర దేశానికైనా ఇది జరగవచ్చు అనేది చాలా తీవ్రమైన ఆందోళన. రేపు ఇది భారతదేశానికి కూడా జరగవచ్చు’’ అని చవాన్ అన్నారు. వెనిజులాలో నికోలస్ మదురోకు జరిగినట్లుగా భారతదేశంలో జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా?” అని ప్రశ్నించారు. ప్రపంచంలోని ప్రధాన సంఘర్షణలపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో విఫలమైందని చవాన్ ఆరోపించారు. రష్యా, చైనాలు ఏదో ఒక వైఖరిని తీసుకున్నాయని, అమెరికాను విమర్శించాయని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ ఇలాగే చేసిందని, ఏ పక్షాలనికి మద్దతు ఇవ్వలేదని, ఇజ్రాయిల్-హమాస్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోలేదని అన్నారు. మనం అమెరికన్లకు ఎంతగా భయపడుతున్నామంటే, దానిని విమర్శించడానికి కూడా భయపడుతున్నామని చవాన్ అన్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై చవాన్ స్పందిస్తూ.. ఇవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. వెనిజులా ఆయిల్ నిల్వలే అసలైన కారణం అని అన్నారు. వెనిజులా ఆయిల్పై అమెరికా కన్నేసిందని ఆరోపించారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాలు అమెరికాను విమర్శించాయని, భారత్ మాత్రం మౌనంగా ఉందని అన్నారు. మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్న స్థితిలో, భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కావాలని అనుకుంటే ఇలాంటి విషయాలపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని అన్నారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!