Corona: ఇండియాలో 2 వేలకు దిగువకు కొత్త కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే దాదాపుగా ప్రపంచంలో అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పట్లో ఈ మహమ్మారి ప్రపంచాన్నివదిలేలా కనిపించడం లేదు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొన్ని నెలులుగా కేసుల సంఖ్య రెండు మూడు వేలకు దిగువనే ఉంటున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కేవలం 1675 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. 24 గంటల్లో కరోనాతో బాధపడుతూ… 31 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,841గా ఉంది. ఒక్క రోజులోనే 1635 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం డైలీ పాజిటివ్ రేటు 0.41 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి మొత్తంగా 4,31,09,248 మంది కరోనా బారిన పడ్డారు. 4,26,00,737 కోలుకోగా… 5,24,490 మంది మహమ్మారి వల్ల మరణించారు.
Also Read
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. వ్యాక్సినేషన్ వల్లే మూడో వేవ్ వచ్చినా.. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయినా… చాలా వరకు మరణాలు అడ్డుకోగలిగాం. దేశంలో సోమవారం నాటికి 192,52,70,955 డోసుల టీకాలు ఇచ్చారు. సోమవారం ఒక్క రోజే 13,76,878 మందికి టీకాలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!