India Corona: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్!.. దేశంలో 15వేలకు పైగా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇవాళ దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ ప్రతిరోజు స్వల్ప హెచ్చుతగ్గులతో 15 వేలకుపైనే కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు 17 వేలకుపైగా కేసులు నమోదు కాగా.. తాజాగా 16 వేల దిగువకు అవి చేరాయి. గడిచిన 24గంటల్లో 3,63,103 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 15,940 మంది వైరస్ బారినపడ్డారు. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 12,425 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్ను విడుదల చేసింది. అయితే వీటిలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే సగానికిపైగా కేసులు ఉంటున్నాయి.
తాజా మరణాలతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా చనిపోయిన వారి మొత్తం సంఖ్య 5,24,974కి చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,61,481 లకు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 91,779గా ఉంది. రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. రోజు రోజుకు నమోదవుతున్న కేసుల మధ్య అంతరం భారీగా ఉంటోంది. శుక్రవారం నాడు 88,284 యాక్టీవ్ కేసులు ఉంటే.. నేడు అది 91,779కి పెరిగింది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.21 శాతం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రోజువారీ పాజిటివ్ రేటు 4.39 శాతంగా ఉంది. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
దేశంలో శుక్రవారం 15,73,341 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,94,40,932 కోట్లకు చేరింది. మరో 3,63,103 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!