Ranya Rao Case: రన్యా రావు కేసులో కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమేయం..!
- రన్యా రావు కేసులో కీలక పరిణామం..
- కీలక విషయాన్ని వెల్లడించిన ఎస్కార్ట్ ఇచ్చిన అధికారి..
- పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకే చేశానని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారి కూతురు కావడం, హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రన్యా రావు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బంగారాన్ని తీసుకువచ్చినట్లు తేలింది. ఎయిర్ పోర్టులో వీఐపీ ప్రోటోకాల్ని రన్యా రావు దుర్వినియోగం చేసినట్లు డీఆర్ఐ అధికారులు ఆరోపించారు. రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి స్వయంగా ఇమ్మిగ్రేషన్కి వెళ్లి, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యారావు లగేజీని తీసుకుంటున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో తనిఖీలను దాటేసి స్మగ్లింగ్కి పాల్పడింది.
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Also: Waqf: “ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం” వక్ఫ్ ఆస్తి.. ఎంఐఎం నేత క్లెయిమ్..
అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘‘డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించామని డీఆర్ఐ అధికారుల ముందు పోలీస్ అధికారి అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకే ప్రోటోకాల్ మంజూరు వారు అంగీకరించారు’’ అని డీఆర్ఐ తరుపున వాదించిన స్పెషల్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) మధురావు కోర్టుకు తెలిపారు.
ఈ సంఘటనలో రన్యా రావు సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి, ప్రస్తుత డీజీపీ కే.రామచంద్రారావు ప్రమేయం ఉందా..? అనే దానిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్భంగా రన్యా రావు బెయిల్ పిటిషన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. రూ 50 లక్షలకు మించి కస్టమ్ సుంకం ఎగవేత తీవ్రమైన నేరంగా చెప్పారు. ఇది కస్టమ్స్ చట్టంలోని క్షన్ 135(1)(ఎ) మరియు (బి) కిందకు వస్తుందని, దీనిని శిక్షించదగిన మరియు బెయిల్ ఇవ్వలేని నేరంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
-
ASUS T3201: 9,000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల OLED డిస్ప్లేతో.. ASUS కొత్త టాబ్లెట్ విడుదల
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!