Manipur: చుక్కల్ని అంటుతున్న నిత్యావసరాలు.. వేలల్లో వంటగ్యాస్, బియ్యం ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: సంక్షోభంలో చిక్కుకున్న మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. చాలా చోట్ల బ్లాక్ దందా మొదలైంది. మూడు వారాల క్రితం మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది వరకు చనిపోయారు. సైన్యం, పారామిలిటరీ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా.. నిత్యవసరాలు ధరలు మాత్రం కొండెక్కాయి. మణిపూర్ కు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన దిగుమతులపై ప్రభావం పడింది.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
బియ్యం, బంగాళాదుంపలు, ఉల్లిపాయల ధరలు గతంలో పోలిస్తే రూ. 20 నుంచి రూ.30 వరకు పెరిగాయి. 50 కిలోల బియ్యం బ్యాగ్ ధర గతంలో రూ.900 ఉంటే ఇప్పుడు రూ. 1800కు చేరింది. ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో రూ.1800 కు విక్రయిస్తున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 170కి చేరింది. 30 గుడ్ల ధర రూ.180 నుంచి రూ. 300 అయింది. ఇలా అన్నింటి ధరలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి.
షెడ్యూల్ తెగ హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా ఇతర గిరిజన కమ్యూనిటీలు అయిన నాగా, కుకీలు హిల్ డిస్ట్రిక్స్ లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహిస్తున్న సమయంలో ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. రెండు వర్గాలు తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. చాలా మంది రాష్ట్రం నుంచి ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లారు. మణిపూర్ లో 53 శాతం మెయిటీ కమ్యూనిటీ ప్రజలు ఉంటారు. వీరంతా ఇంఫాల్ లోయలో నివసిస్తుంటారు. నాగా, కుకీలు గిరిజన హోదా ఉంది. వీరంతా కొంత ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఇదిలా ఉంటే కూకి తెగకు చెందిన కొంతమంది అక్రమంగా మయన్మార్ నుంచి మణిపూర్ లోకి ప్రవేశించి ఇక్కడ మైనారిటీ హోదా పొందుతున్నారని మెయిటీ వర్గం ఆరోపిస్తోంది. ఎన్ఆర్సీని చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం 10,000 మంది సైన్యం, పారామిలిటరీ బలగాలు మణిపూర్ లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!