Car theft: కార్ దొంగిలించిన ముగ్గురు.. ఎవరికీ డ్రైవింగ్ రాదు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటే నవ్వాపుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
Read Also: Asaduddin Owaisi: మోడీ కాదు ఆయనే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి.. అలా అయితేనే వస్తాం..
Also Read
కాలేజ్ తో చదువుతున్న సత్యం కుమార్, అమన్ గౌతమ్, అమిత్ వర్మ అనే ముగ్గురు దొంగల్ని పోలీసులు అరెస్ట్ చేశారెు. సత్యం బీటెక్ చదువుతుండగా.. అమన్ బీకామ్, అమిత్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరంతా కలిసి డబ్బులు సంపాదించేందుకు కాన్పూర్ లోని దబౌలి ప్రాంతంలో ఓ మారుతి వ్యాన్ ను కొట్టేశారు. అయితే అక్కడి నుంచే ఈ ముగ్గురి కష్టాలు మొదలయ్యాయి. కారు నడపడం ముగ్గురికి తెలియకపోవడంతో రాత్రి 10 కిలోమీటర్లు వ్యాన్ ను తోసుకుంటూ వెళ్లారు. కార్ నెంబర్ ప్లేట్ తొలగించారు. 10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ ప్రాంతంలో దాచిపెట్టారు.
ముగ్గురు నిందితులను మే 7న దబౌలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లుగా ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు. కార్ నడపడం రాకపోవడంతో దబౌలి నుంచి కళ్యాణ్ పూర్ వరకు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెల్లారని తెలిపారు. ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని, ఒకవేళ కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
తాజావార్తలు
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..