RPF Constable: రైలులో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ డిస్మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RPF Constable: రైలులో కాల్పులు జరిపి నలుగురు మరణానికి కారణమైన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. అతని ప్రవర్తన సరిగా లేదని.. గతంలో కూడా ఇలాంటి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని పేర్కొన్న రైల్వే అధికారులు.. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ స్పష్టం చేశారు. జైపూర్-ముంబై రైలులో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కేసులో సోమవారం రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ను సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టు ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూర్టీ కమీషనర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో 2017లో ఓ ముస్లిం వ్యక్తిని వేధించాడని, ఉజ్జయినిలో డాగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఘటన జరిగిందని అధికారి తెలిపారు. అతను గుజరాత్లో పనిచేస్తున్న సమయంలో తన సహోద్యోగిని కొట్టాడని.. మరోసారి తనతో పనిచేసే వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసినట్లు చేతన్పై ఆరోపణలు ఉన్నాయని అధికారి చెప్పారు. జైపూర్ రైలులో సీనియర్ను కాల్చి చంపిన ఘటన ఆధారంగా అతన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Read also: Apple Price Hike: ఆకాశాన్నంటుతున్న యాపిల్ పండ్ల ధరలు
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
జైపూర్-ముంబై రైలులోని బీ2 బోగీలో జూలై 31న ఓ ప్రయాణికుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కానిస్టేబుల్ చేతన్ బెదిరించాడు… అంతేకాకుండా తుపాకీని గురిపెట్టి ఆ ప్రయాణికుడిని ప్యాంట్రీ కార్ వద్దకు తీసుకువెళ్లినట్లు కొందరు సాక్షులు చెబుతున్నారు. అక్కడకు వెళ్లిన తరువాత ప్రయాణికుడిని చేతన్ షూట్ చేశాడు. జీర్పీఎఫ్ పోలీసులు తమ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. చేతన్ సింగ్ తన సీనియర్ టికా రామ్ మీనాను కూడా షూట్ చేశాడు. పాల్గర్ రైల్వే స్టేషన్ దగ్గర తన వద్ద ఉన్న ఆటోమెటిక్ వెపన్తో మరో ముగ్గురు ప్రయాణికుల్ని కూడా కాల్చాడు. బీ2 ఏసీ బోగీలో ట్రావెల్ చేస్తున్న సయ్యిద్ అనే ప్రయాణికుడిని గన్పాయింట్లో బెదిరిస్తూ ప్యాంట్రీ కారు వద్దకు తీసుకువెళ్లినట్లు జీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. బీ2, బీ1 కోచ్లను దాటేసి ప్యాంట్రీ కార్ చేరుకున్నారని, దాన్ని ఇతర ప్రయాణికులు చూసినట్లు చెప్పారు. అయిదు బోగీల్లో ఉన్న ప్రయాణికుల నుంచి జీఆర్పీఎఫ్ పోలీసులు సమాచారాన్ని తీసుకున్నారు. ఎక్కువ మంది ప్రయాణికుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుడు చేతన్ సింగ్కు మెడికల్ పరీక్షలు నిర్వహించారు. అతను ఏ ఉద్దేశంతో కాల్పులకు జరిపాడో స్పష్టంగా తెలియదని విచారణ అధికారులు ప్రకటించారు. అబ్దుల్ ఖాదర్భాయ్ మొహమ్మద్ హుస్సేన్, అస్గర్ అబ్బాస్ షేక్, సయ్యిద్ ఎస్ అనే ప్రయాణికుల్ని చేతన్ షూట్ చేశాడు. బీ5 కోచ్లో ఉన్న ఓ ప్రయాణికుడు, ఎస్6లో ఉన్న మరో ప్రయాణికుడిని అతను హతమార్చాడు. బీ5 నుంచి ఎస్6 బోగీ మధ్య దాదాపు 8 బోగీలు ఉన్నాయి. అయితే కానిస్టేబుల్ చేతన్ ఆ ముగ్గుర్ని ఎందుకు చంపాడో క్లారిటీ లేదని అధికారులు తెలిపారు. విచారణ కమిటీ తన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!