Maha Kumbh Mela: కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణం.. 16,000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు..
- కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర అనుమానం..
- 16000 మొబైల్ నెంబర్లపై దర్యాప్తు చేస్తున్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చురుకుగా ఉన్న 16,000 కంటే ఎక్కువ మొబైల్ నెంబర్ డేటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆ నంబర్లలో చాలా వరకు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కంట్రోల్ రూం నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ నుంచి అనుమానితుల ముఖాలను గుర్తించే యాప్ ద్వారా గుర్తిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
Read Also: Nayanthara: వాళ్ళ కారణంగా నయనతార నరకం చూసింది.. నిజాలు బయటపెట్టిన నాగార్జున !
వసంత పంచమ సందర్భంగా సోమావారం జరగనున్న మూడో అమృత స్నానం సమయంలో అదనపు భద్రతను మోహరించారు. నాల్గవ మహా స్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ నాడు జరుగుతుండగా, చివరిది ఫిబ్రవరి 26న మహా శివరాత్రి నాడు జరుగుతుంది. ఇటీవల తొక్కిసలాటలో మరణించిన 30 మంది బాధితుల్లో ఎక్కువ మంది బీహార్ నుంచే ఉన్నారు. మౌని అమావాస్య రోజున భారీగా ప్రజలు రావడంతో తొక్కిసలాట జరిగింది. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ ఏర్పాటు చేసింది. శుక్రవారం వీరు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ప్యానెల్ నెల రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!