Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
- యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన
- 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి మూడు వికెట్స్
- టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jai Moondra Reaction on Player of the Match and Series. భారత్తో జరిగిన టీ20 సిరీస్లో ఐర్లాండ్ యువ క్రికెటర్ జై ముంద్రా అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో టీ20లో తన 4 ఓవర్ల కోటాలో 32 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్స్ పడగొట్టాడు. మొదటి టీ20లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్స్ తీశాడు. రెండు మ్యాచ్లలో ఆరంభంలో కీలక వికెట్స్ తీసిన భారత సంతతి ఆటగాడు జైకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. అవార్డులు అందుకున్న అనంతరం జై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కేవలం రెండు అంతర్జాతీయ మ్యాచ్లకే అవార్డులు, ఈ గుర్తింపు రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టైన భారత్పై తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడం జీవితంలో మరచిపోలేని అనుభూతి అని పేర్కొన్నాడు.
ఇంకా ఆ ఫీలింగ్ జీర్ణించుకోలేకపోతున్నా:
‘ఈ అనుభూతిని ఇప్పటికీ పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను. నా ఆనందాన్ని ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు భారత్. అలాంటి జట్టుపై మనల్ని మనం పరీక్షించుకోవడం అద్భుతమైన అనుభవం. ఎక్కువగా ప్రాథమిక అంశాలపైనే దృష్టి పెట్టాలని ముందే నిర్ణయించుకున్నాను. జట్టు సహచరులు, కోచింగ్ సిబ్బంది అందించిన మద్దతే ఈ విజయానికి కారణం’ అని జై ముంద్రా తెలిపాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్పై ఘన విజయం..
కష్టకాలంలో ప్రశాంతంగా ఉండాలి:
తన కెరీర్లో ఎదురైన ఒడిదుడుకుల గురించి మాట్లాడిన జై ముంద్రా.. ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజమేనని చెప్పాడు. ‘ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి. ప్రశాంతంగా ఉండి మన పని మనం చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. నేను కూడా అదే చేశాను’ అని పేర్కొన్నాడు.
ఐర్లాండ్ నన్ను తమవాడిలా చూసుకుంది:
ఐర్లాండ్ జట్టులో తనకు లభించిన ఆదరణ గురించి కూడా జై ముంద్రా స్పందించాడు. ‘నేను భారత్ నుంచి ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఎవరూ నన్ను కొత్త వ్యక్తిలా చూడలేదు. అందరూ తమ జట్టు సభ్యుడిగానే భావించారు. అద్భుతమైన వాతావరణం, మంచి మనుషులు, మంచి సహకారం లభించాయి. నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంపైనే దృష్టి పెట్టాను’ అని చెప్పాడు.
సంజూ శాంసన్కు బౌలింగ్ చేసేటప్పుడు ఇదే ఆలోచన:
భారత్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్కు బౌలింగ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న జై ముంద్రా.. ‘ప్రణాళికను మార్చకుండా, సాధారణంగా ఎలా బౌలింగ్ చేస్తానో అలాగే చేయాలని అనుకున్నాను. సంజు లాంటి టాప్ బ్యాటర్కు బౌలింగ్ చేయడం సులభం కాదు. చిన్న తప్పిదానికే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ప్రణాళికకు కట్టుబడి బౌలింగ్ చేశాను’ అని వెల్లడించాడు.
భారత్పై ఈ అవార్డు వస్తుందని ఊహించలేదు:
భారత్పై సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకోవడం గురించి జై ముంద్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘భారత్ వంటి బలమైన జట్టుపై ఈ అవార్డు గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికీ అది నిజమేనా అనే భావన నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఇది నా కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన క్షణం’ అని భావోద్వేగంగా చెప్పాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!