Vice-President: తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..! ఆ పార్టీ నేతకు ఛాన్స్!
- తదుపరి ఉపరాష్ట్రపతిగా పేర్లు పరిశీలన..!
- సంకీర్ణ పార్టీ నేతకు అవకాశం దక్కే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవి ఉండగానే రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో వైదొలగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ధన్ఖర్ పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజీనామా చేయడం విమర్శలకు తావిస్తోంది. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే ధన్ఖర్ రాజీనామా చేశారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా
Also Read
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
అయితే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. ధన్ఖర్ వారసుడి కోసం వేట మొదలైంది. ఈ పోటీలో సీనియర్ గవర్నర్లు, కేంద్రమంత్రులు, అనుభవజ్ఞులైన పార్టీ నాయకులు ఉన్నారు. అయితే త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నేతకే ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జేడీయూ నేతృత్వంలో బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు హరివంశ్ను ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోబెడితే ప్రయోజనం చేకూరుతుందని హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరివంశ్ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక ఉపరాష్ట్రపతి స్థానంలో ఆయన్నే కూర్చోబెడితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసొస్తుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: CBSE: సీబీఎస్ఈ పాఠశాలల్లో కొత్త నిబంధనలు.. ఆదేశాలు జారీ
ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు నితీష్ కుమార్ కూడా ఎన్నికల హామీలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి పదవిని బీహార్ నేతకు అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!