Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం.. సీనియర్ కాంగ్రెస్ నేత మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress’s Krishna Kumar Pandey dies during Rahul Gandhi-led Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్ర చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ సీనియర్ కాంగ్రెస్ నేత మరణించారు. కాంగ్రెస్ సేవాదళ్ నాయకుడు కృష్ణ కుమార్ పాండే భారత్ జోడో యాత్రలో పాల్గొంటూ మంగళవారం మరణించారు. యాత్రలో కుప్పకూలిన కృష్ణ కుమార్ పాండేను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడే అతను మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెళ్లడించారు.
Read Also: Tamilisai Soundararajan: గవర్నర్ దగ్గర పెండింగ్లో పలు బిల్లులు.. తమిళిసై ఆగ్రహం
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
పాండే తన చివరి క్షణాల్లో, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ వెల్లడించారు. అంబులెన్సులో అతడిని తరలించే సమయానికే అతను చనిపోయినట్లు జైరాం రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణకుమార్ కరడుగట్టిన కాంగ్రెస్ వాది అని.. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేవాడని ఆయన అన్నారు. పాండే మరణంపై రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ పాండే మరణం మొత్తం కాంగ్రెస్ కుటంబానికి బాధాకరమని.. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అతను తన చివరి క్షణంలో కూడా త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నాడని.. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన రాహుల్ గాంధీ ‘‘ భారత్ జోడో యాత్ర’’ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. నాందేడ్ జిల్లాలోని గురుద్వారాను సందర్శించిన రాహుల్ గాంధీ మంగళవారం యాత్రను పున: ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రులు సుశీల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, మహారాష్ట్ర పీసీసీ చీఫ్ నానా పటోలే, సీనియర్ నాయకులు బాలా సాహెబ్ థోరట్, మణిక్ రావు ఠాక్రే, నసీమ్ ఖాన్ పాల్గొన్నారు. దాదాపుగా 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. జమ్మూ కాశ్మీర్ తో భారత్ జోడో యాత్ర ముగియనుంది.
कांग्रेस सेवा दल के महासचिव, कृष्णकांत पांडे जी का निधन पूरे कांग्रेस परिवार के लिए बहुत दुःखद है। उनके प्रियजनों को मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
आज, यात्रा के दौरान अंतिम समय में उन्होंने हाथों में तिरंगा थामा था। देश के लिए उनका समर्पण हमें सदा प्रेरणा देता रहेगा। pic.twitter.com/VvC1O5ZJfh
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2022
తాజావార్తలు
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
-
Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!