Congress: ఈ నెల 28న సీడబ్ల్యూసీ సమావేశం.. అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్ ఖరారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Working Committee To Meet On Sunday: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసేందుకు ఈ నెల 28న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార కమిటీ అయిన కాంగ్రెస్ వర్కంగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) సమావేశం అవుతోంది. ఆగస్టు 28, మధ్యాహ్నం 3.30 గంటలకు సోనియా అధ్యక్షతన వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ట్విట్టర్లో వెల్లడించారు.
ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. అయితే రాహుల్ మాత్రం అందుకు సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తరువాత అప్పటి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియాగాంధీ మళ్లీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులతో పాటు అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు వర్గం జీ-23 నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఈ పరిణామాల తర్వాత రాజస్థాన్ లో జరిగిన చింతన్ శిబిర్ లో కీలక నిర్ణయం ఉంటుందని భావించినప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల దిశగా ఏ నిర్ణయం తీసుకోలేదు.
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
Read Also: Addanki Dayakar: ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే..!
ఇదిలా ఉంటే వచ్చే నెల సెప్టెంబర్ లో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయబోతోంది. సెప్టెంబర్ 4న ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసన తెలపబోతోంది. దీంతో పాటు సెప్టెంబర్ 7 నుంచి రాహుల్ గాంధీ దేశమంతా ‘‘ భారత్ జోడో’ యాత్రను మొదలుపెట్టనున్నారు. మరోవైపు కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలోనే సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా విదేశాలకు వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!