BJP: మరేం పర్వాలేదు.. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఆనందమే.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135 స్థానాల్లో గెలుపొందింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 137కు చేరింది.
Read Also: DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…
Also Read
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలతో సగటు బీజేపీ కార్యకర్త, నాయకుడు నిరాశ చెందాడనేది వాస్తవం. అయితే మరో విషయాన్ని తలుచుకుని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే కర్ణాటకలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుంది. గతంలో కొన్ని పర్యాయాలు ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కాబట్టి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో మంచి మెజారిటీలో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా.. కాంగ్రెస్, జేడీయూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అయితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం కొనసాగింది. తిరిగి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి.. 2024లో వచ్చేది బీజేపే అని సగటు బీజేపీ అభిమాని సంతోషపడుతున్నాడు. ఈ విషయాలన్నే బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!