BJP: మరేం పర్వాలేదు.. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఆనందమే.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135 స్థానాల్లో గెలుపొందింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 137కు చేరింది.
Read Also: DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలతో సగటు బీజేపీ కార్యకర్త, నాయకుడు నిరాశ చెందాడనేది వాస్తవం. అయితే మరో విషయాన్ని తలుచుకుని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే కర్ణాటకలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుంది. గతంలో కొన్ని పర్యాయాలు ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కాబట్టి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో మంచి మెజారిటీలో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా.. కాంగ్రెస్, జేడీయూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అయితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం కొనసాగింది. తిరిగి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి.. 2024లో వచ్చేది బీజేపే అని సగటు బీజేపీ అభిమాని సంతోషపడుతున్నాడు. ఈ విషయాలన్నే బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!