BJP: మరేం పర్వాలేదు.. కర్ణాటకలో ఓడినా బీజేపీ ఆనందమే.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటక ఎన్నికల్లో కన్నడ ప్రజలు సంప్రదాయాన్ని కొనసాగించారు. దాదాపుగా గత మూడు దశాబ్ధాలుగా వరసగా ఏ పార్టీ కూడా రెండు సార్లు అధికారం ఏర్పాటు చేయలేదు. 1985 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా 2023 ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయింది. బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో బీజేపీ 66 స్థానాలకు పరిమితం అయితే.. కాంగ్రెస్ ఏకంగా మ్యాజిక్ ఫిగర్ 113ని దాటేసి 135 స్థానాల్లో గెలుపొందింది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ బలం 137కు చేరింది.
Read Also: DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ఫలితాలతో సగటు బీజేపీ కార్యకర్త, నాయకుడు నిరాశ చెందాడనేది వాస్తవం. అయితే మరో విషయాన్ని తలుచుకుని బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే కర్ణాటకలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుంది. గతంలో కొన్ని పర్యాయాలు ఇదే తరహా పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వస్తుంది కాబట్టి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో మంచి మెజారిటీలో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా.. కాంగ్రెస్, జేడీయూలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అయితే 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రభుత్వమే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం కొనసాగింది. తిరిగి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఈ సారి కూడా కాంగ్రెస్ అధికారం చేపడుతుంది కాబట్టి.. 2024లో వచ్చేది బీజేపే అని సగటు బీజేపీ అభిమాని సంతోషపడుతున్నాడు. ఈ విషయాలన్నే బీజేపీ కీలక నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వసర్మ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!