Love Jihad: కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురి హత్య.. లవ్ జిహాద్ అంటూ బీజేపీ ఆరోపణలు.. తండ్రి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Love Jihad: కర్ణాటకలోని హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య ఆ రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నేహా హిరేమత్(23) అనే ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదే కాలేజీకి చెందిన సీనియర్ ఫయాజ్ ఖోండునాయక్ దారుణంగా కత్తితో అనేకసార్లు పొడిచి చంపాడు. ఈ ఘటన మొత్తం కాలేజ్ క్యాంపస్లోనే జరిగింది. నిందితుడి విచారణ సందర్భంగా తామిద్దరం రిలేషన్లో ఉన్నామని చెప్పాడని, ఇటీవల తనకు దూరంగా పెట్టడంతోనే హత్య చేశాడని చెప్పాడు.
అధికార కాంగ్రెస్ పార్టీ ఇది వ్యక్తిగత కోణంలో జరిగిన సంఘటనలా చూపే ప్రయత్నం చేస్తో్ందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని బీజేపీ పేర్కొంది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని కేంద్ర మంత్రి, ధార్వాడ్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ఆపాలని బీజేపీ కోరింది. అయితే, కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర ఇందులో లవ్ జిహాద్ కోణం లేదని చెప్పాడు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Kohli DK: ‘నీ భార్య’.. అంటూ దినేష్ కార్తీక్ కు మాటరాకుండా చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..
మరోవైపు బాధిత యువతి తండ్రి కాంగ్రెస్ కార్పొరేటర్ మాత్రం తన బిడ్డ హత్యకు కారణం లవ్ జిహాద్ అని పేర్కొనడం సంచలనంగా మారింది. నిరంజన్ హిరేమత్ మాట్లాడుతూ.. తన కూతురిని ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ ముఠా చాలా కాలంగా కుట్ర పన్నుతోందని, తన బిడ్డను ట్రాప్ చేయాలని అనుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఆమెను బెదిరించారని, అయినప్పటికీ ఆమె బెదిరింపులను ఖాతరు చేయకపోవడంతోనే హత్య చేశారని మీడియాతో అన్నారు.
‘‘ నా కూతురికి ఏమైందో రాష్ట్రం, దేశం మొత్తం చూసింది. వాళ్లు పర్సనల్ అని చెబుతున్నారు, ఇందులో పర్సనల్ ఏం ఉంటుంది.. వారిద్ధరు బంధువులా..?’’ అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి మీనాక్షి లేఖి కూడా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే అవినీతి, నేరం, మతహింస ఉందని చెప్పారు. ఒక రాష్ట్రంలో చట్టం, యంత్రాగం తప్పు చేసేవారిని శిక్షించేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం ఉండాలి, కానీ ఈ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు.
అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, కర్నాటకలో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మరోవైపు హుబ్బళ్లిలోని విద్యానగర్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీతో పాటు రైట్ వింగ్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!