INDIA Bloc: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సంచలన నిర్ణయం!
- ఇండియా కూటమిలో బీటలు
- ఆమ్ ఆద్మీ పార్టీతో తెగతెంపులు
- ఆప్తో పొత్తు ఉండబోదని కాంగ్రెస ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనికి పునాది పడింది. తాజాగా కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని హస్తం పార్టీ శుక్రవారం తేల్చి చెప్పింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ప్రకటించారు. ఢిల్లీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ తాజా ప్రకటనతో దేశ రాజధాని హస్తినాలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తలపడనున్నాయి. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Nigeria: నైజీరియాలో విషాదం.. పడవ బోల్తా పడి 100 మంది మృతి
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఏడాది ప్రారంభంలోనే జరగనున్నాయి. ఇప్పటికే ఆప్ అధినేత కేజ్రీవాల్ 11 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇక బీజేపీ కూడా ఎన్నికల కోసం 43 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీలు మరియు కేంద్ర పథకాల లబ్ధిదారులతో సంప్రదింపుల కోసం ఉద్దేశించిన ప్రచారాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఆదేశాల మేరకు కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు. నామినేషన్, మీడియా సంబంధాలు, ప్రచార కథనాలను సూచించడం, సోషల్ మీడియా, డాక్యుమెంటేషన్, డేటా మేనేజ్మెంట్, ప్రత్యేక పరిచయాలు మరియు లాజిస్టిక్లు వంటి వివిధ ఎన్నికల సంబంధిత పనుల కోసం కమిటీలు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 2025న లేదా అంతకు ముందు జరగాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి. ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మూడవ సారి ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం 2025 ఫిబ్రవరి 15తో ముగియనుంది.
ఇది కూడా చదవండి: Alone Honeymoon: ఒంటరిగా హనీమూన్కి వెళ్లిన పెళ్లికూతురు.. ఇదో విషాధ గాధ!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!