Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Steering Panel Holds First Meeting: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం ప్రారంభం అయింది. ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్,నియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
అక్టోబర్ నెలలో ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయింది. పార్టీ ప్లీనరీ సమావేశాల తేదీలు, ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం అన్నారు. పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
Read Also: Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధిత తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ ప్లీనరీ సమావేశానికి 9 వేల మంది పీసీసీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా 24 ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన మొదటిసారిగా పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ బలోపేతానికి, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా నేడు రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలి ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. కాశ్మీర్ లో యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!