Congress: కాంగ్రెస్ పార్టీ తొలి స్టీరింగ్ ప్యానెల్ సమావేశం.. ప్లీనరీ తేదీలు ఖరారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Steering Panel Holds First Meeting: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం ఆదివారం ప్రారంభం అయింది. ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్,నియర్ నేతలు పి చిదంబరం, ఆనంద్ శర్మ, మీరా కుమార్, అంబికా సోనీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
అక్టోబర్ నెలలో ఖర్గే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) స్థానంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయింది. పార్టీ ప్లీనరీ సమావేశాల తేదీలు, ఎక్కడ నిర్వహించాలన్నదానిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శనివారం అన్నారు. పార్టీ సంస్థాగత విషయాలపై కూడా చర్చలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
Read Also: Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక
వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధిత తేదీలను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ ప్లీనరీ సమావేశానికి 9 వేల మంది పీసీసీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా 24 ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన మొదటిసారిగా పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ బలోపేతానికి, బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గుండా నేడు రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలి ప్రాంతాల్లో భారత్ జోడో యాత్ర జరుగుతుంది. కాశ్మీర్ లో యాత్ర ముగుస్తుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!