PM Modi: కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..
- కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి.. కులతత్వం.. మతతత్వ..
- హర్యానా ప్రచార ముగింపుకు ముందు ప్రధాని మోడీ ఫైర్..
- కర్ణాటక.. హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది..
- హర్యానాలోని 90 సీట్లకు శనివారం పోలింగ్.. అక్టోబర్ 08న రిజల్ట్స్..
PM Modi: మరో రెండు రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని రోజులుగా తాను హర్యానాలో పర్యటిస్తున్నానని, ప్రజలు మూడోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించబోమని మోడీ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.
2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా ప్రజల్ని సుసంపన్నం చేయడానికి కృషి చేసిందని, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపారు. తండ్రీకొడుకుల రాజకీయాల (‘బాపు-బేటే కి రాజనీతి’) ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే అని ఆరోపించారు. హిమాచల్, కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదని చెప్పారు.హర్యానాకు కాంగ్రెస్ ఎప్పటికి సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని, ఆ పార్టీ అంతర్గత పోరును ప్రస్తావించారు.
Also Read
- Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
- NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
Read Also: Pune: ప్రధాని మోడీకి గుడి కట్టిన బీజేపీ కార్యకర్త మనస్తాపం.. బీజేపీకి గుడ్బై
రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రిజర్వేషన్లను అంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ భారతదేశాన్ని బలోపేతం చేయడని మోడీ అన్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తం భారత్ వైపే ఉందని, ప్రపంచం చాలా ఆశలు, అంచనాలతో భారత్ వైపు చూస్తోందని, హర్యానా ప్రజలు దేశాన్ని బలోపేతం చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, హర్యానా ఓటర్లు మరోసారి బీజేపీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు.
అంతకుముందు రోజు హర్యానా నుహ్లో జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. హర్యానాలో ద్వేషం, ప్రేమ మధ్య యుద్ధం జరుగుతోందని, ద్వేషాన్ని అంతం చేయాలని, భారత్ ద్వేషపూరిత దేశం కాదని, ఇది ప్రేమ కలిగిన దేశం అని అన్నారు. రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, రాజ్యాంగం అలాగే ఉండేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 08న కౌంటింగ్ జరగనుంది.
తాజావార్తలు
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!