Rahul Gandhi: రాహుల్ గాంధీకి సీటు కేటాయింపుపై వివాదం.. అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- రిపబ్లిక్ వేడుకల్లో రాహుల్ గాంధీ సీటు కేటాయింపుపై వివాదం..
- తమ నేతను మూడో వరసలో కూర్చోబెడుతారా అంటూ కాంగ్రెస్ ఆగ్రహం..
- అసలు ప్రోటోకాల్ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సీట్ల కేటాయింపు వివాదంగా మారింది. మూడో వరసలో వీరిద్దరికి సీట్లు కేటాయించారు. ఇలా తమ నేతలను మూడో వరసలో కూర్చోబెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పార్టీ ఆరోపిస్తోంది. తమ పాలనలో ఎల్కే అద్వానీకి ముందు వరస సీటు కేటాయించామని చూపుతూ ఒక ఫోటోను కాంగ్రెస్ విడుదల చేసింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడి పట్ల ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం ప్రోటోకాల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆత్మన్యూనతా భావంతో బాధపడుతోందని, ఇది వారి నిరాశను వెల్లడిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపించారు. 2014లో ఎల్కే అద్వానీకి ముందు వరసలో సీటు కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఒక ఫోటోను రిలీజ్ చేశారు. అయితే, దీనికి కౌంటర్గా 2014లో రాజ్యసభలో, లోక్సభలో ఎల్కే అద్వానీ ప్రతిపక్ష నేత కాదని, ఆ సమయంలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో, సుష్మా స్వరాజ్ లోక్సభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నారని బీజేపీ చెప్పింది.
ప్రోటోకాల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి.?
ఈ ఆరోపణలపై కేంద్రం అధికారికంగా స్పందించనప్పటికీ, ఇలాంటి కార్యక్రమాల్లో సీట్ల కేటాయింపులు రాష్ట్రపతి సెక్రటేరియట్ జారీ చేసిన ప్రాధాన్యతా ప్రకారం ఖచ్చితంగా ఉంటాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకులు ప్రాధాన్యతా క్రమంలో 7వ స్థానంలో ఉంటారు.
దీనిని రాజకీయం చేయడంపై కాంగ్రెస్పై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘రాహుల్ గాంధీ మూడో వరుసలో కూర్చోవడం గురించి ఆందోళన చెందడం లేదు, కర్తవ్యపథ్లో దేశం బ్రహ్మోస్ క్షిపణులను సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో తను ఫోన్ను చూస్తూ దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అని బీజేపీ నేత ప్రదీప్ భండారీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
This was in 2014—look at where LK Advani ji was seated then.
Why this protocol mess-up now?
Is it because Modi and Shah want to insult Kharge ji and Rahul ji?Leaders of the Opposition cannot be insulted like this, especially on Republic Day.#RepublicDay https://t.co/1zUMsILyDX pic.twitter.com/tPOlpaGKTG
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 26, 2026
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!