Karnataka: మా కరెంట్ బిల్లులు కాంగ్రెస్ కడుతుంది.. వారి నుంచే తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ప్రజలు విద్యుత్ బిల్లులు కట్టేందుకు ససేమిరా అంటున్నారు. కర్ణాటక వ్యాప్తంగా పలు జిల్లాలో ఇదే విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో విద్యుత్ అధికారులు గ్రామాల్లో బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన సమయంలో తాము బిల్లులు కట్టం అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు.
Read Also: IND vs PAK : టీమిండియా-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ కు ప్లాన్..?
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. అయితే పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొప్పల్, కలబురిగి, చిత్రదుర్గ వంటి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో విద్యుత్ అధికారులకు ఇలాంటి సమాధానాలే విద్యుత్ అధికారులకు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మా బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు మీటర్ రీడింగ్ చేసేందుకు గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు ఈ విధంగా స్పందిస్తున్నారు. చిత్రదుర్గలో ఓ మహిళకు బిల్లు అందచేయగా.. ఆమె బిల్లు చెల్లించేందుకు నిరాకరించింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని, అప్పటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన హామీకి అర్హురాలినని చెప్పింది. మా బిల్లులను సిద్దరామయ్య, డీకే శివకుమార్ చెల్లిస్తారని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత నుంచి 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు కాబట్టి ఇటువైపు రావద్దని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటకలో మొత్తం 1.9 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వీరంతా 200 యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీని వాడుకుంటే నెలకు 3,845 మిలియన్ యూనిట్లు అవుతుంది. ప్రస్తుతం యూనిట్ కు రూ. 8.75 అనుకున్నా.. నెలకు రూ. 3,367 కోట్లు అవుతుంది. అంటే ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై రూ. 44,404 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ ఇందులో సగం కుటుంబాలు ఈ హామీ పరిధి కిందకు వచ్చినా.. ఏడాదికి రూ. 20,000 కోట్లు ఖర్చు అవుతుంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!