Rajasthan: రాజస్థాన్ కాంగ్రెస్లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ల మధ్య కోల్డ్వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
congress presidential election triggered a crisis in the Rajasthan: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ వర్గాల మధ్య పొసగడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తదుపరి సీఎంగా సచిన్ పైలెట్ బాధ్యతలు చేపడుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ పైలెట్ సీఎం పదవి కోసం పావులు కదుపుతున్నారు. అయితే అతనికి చెక్ పెట్టేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రయత్నాలు ప్రారంభించారు.
Read Also: Nikhil: ‘కార్తికేయ 3’ మాములుగా ఉండదంట.. ?
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
సీఎంగా ఉంటూనే.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని అశోక్ గెహ్లాట్ అనుకున్నప్పటీకీ.. రాహుల్ గాంధీ ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అని స్పష్టం చేయడంతో గెహ్లాట్ ఆశలు అడియాశలు అయ్యాయి. మరోవైపు సచిన్ పైలెట్, రాహుల్ గాంధీతో కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నాడు. ఒకవైపు చివరి ప్రయత్నంగా రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేలా ఒత్తడి తీసుకురావడానికి కేరళ వెళ్తున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ ఎన్నికైతే.. ఆయన రాజస్థాన్ సీఎంగా పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.
ఇదే జరిగితే సచిన్ పైలెట్ కు చెక్ పెట్టేవిధంగా అశోక్ గెహ్లాట్ పావులు కదుపుతున్నారు. తాను సీఎం పదవి నుంచి తప్పుకుంటే స్పీకర్ సీపీ జోషిని సీఎంగా చేయాలని సిఫారసు చేశారు. 2020లో సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన సయమంలో స్పీకర్ జోషి, సీఎం అశోక్ గెహ్లాట్ కు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన జోషి పేరును సిఫార్సు చేశారు. రాజస్థాన్లోని రాజ్సమంద్ జిల్లాలోని కున్వారియాలో జన్మించిన జోషి సైకాలజీ, న్యాయశాస్త్రాల్లో పట్టా పొందారు. లెక్చరర్ గా ఉన్న జోషి కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకొచ్చారు. 2008లో జోషి రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!