Bharat Jodo Yatra: మరో జోడో యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. ఈ సారి ఈస్ట్ టూ వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Plans East-West Bharat Jodo-Like Yatra Before 2024 Polls: కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురావడానికి ఆ పార్టీ ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతోంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. జమ్మూ కాశ్మీర్ తో ఈ యాత్ర ముగుస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముగిసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. డిసెంబర్ మొదటివారంలో భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లోకి ప్రవేశించనుంది.
Read Also: Dharampal Singh: మదర్సా విద్యార్థులు మౌళ్వీలుగా మారడం కాదు.. ఐఏఎస్ అధికారులు కావాలి…
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఇదిలా ఉంటే మరో జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల ముందు తూర్పు నుంచి పశ్చిమం వైపు భారత్ జోడో యాత్రను నిర్వహించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు విభాకర్ శాస్త్రీ మంగళవారం వెల్లడించారు. దీని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్ జోడో యాత్ర దేశంలోని ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడం, దేశంలో సామరస్యాన్ని నెలకొల్పడం, ద్రవ్యోల్భాన్ని, నిరుద్యోగం వంటి సమస్యలను లేవనెత్తడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.
రాజస్థాన్ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర మార్గాన్ని మంగళవారం ఖరారు చేస్తారని విభాకర్ శాస్త్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఝలావర్, కోట, దౌసా, అల్వార్ ప్రాంతాల గుండా సాగనుంది. కేంద్రంలో ఎనిమిదేళ్లుగా బీజేపీ సాగిస్తున్న దుష్ఫరిపాలనకు వ్యతిరేకంగా యాత్ర కొనసాగిస్తున్నట్లు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా అన్నారు. బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ.. రాహుల్ గాంధీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!