ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ‘రాజీవ్ యువ మితాన్ క్లబ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. బీజేపీ, నరేంద్ర మోడీ భారతదేశంలోని ఇద్దరు, ముగ్గురు బిలియనీర్ల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. భారత ప్రధాని అదానీపై విచారణ జరపలేరని, ఎందుకంటే విచారణ తర్వాత నష్టం అదానీకి కాదని విమర్శించారు. మరోవైపు జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తప్పుపట్టారు.
Lifestyle : పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చెయ్యకండి.. ఎందుకంటే?
బీజేపీ పని ప్రజలను విభజించడం, హింసను వ్యాప్తి చేయడం, విద్వేషాన్ని వ్యాప్తి చేయడమని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అయితే కాంగ్రెస్ చేసే పని ప్రజలను ఏకం చేయడమని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చెప్పుకున్న గొప్పలను రాహుల్ ప్రస్తావిస్తూ, ప్రతి ఎన్నికలకు ముందు బీజేపీ ఒక సంఖ్య చెబుతుందని, కర్ణాటకలో కూడా 230 నుంచి 250 సీట్లు గెలుచుకుంటామని చెప్పుకుందని, కానీ కర్ణాటకలోని ప్రతి పేద వ్యక్తి కాంగ్రెస్కు ఓటు వేశాడని అన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామన్న హామీని బీజేపీ నెరవేర్చలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ కోరారు. మరోవైపు గిరిజనులను బీజేపీ అటవీ వాసులుగా పిలుస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశమంతటా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని.. కానీ కాంగ్రెస్ చేసే పని కనెక్ట్ చేయడమేనని తెలిపారు. మణిపూర్, అస్సాం, కర్ణాటకలో బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని మండిపడ్డారు.
Curd Health Benefits: ప్రతీరోజు పెరుగు తింటే.. ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు..
ఛత్తీస్గఢ్లో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. దీంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాయి. 48 లక్షల మంది యువ ఓటర్లు ఇక్కడ ఉండగా.. వీరిలో 4.43 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో 68 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 15 సీట్లకే పరిమితమైంది. జేసీసీ (జే) ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందగా.. దాని భాగస్వామ్య పార్టీ బీఎస్పీ రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కు ప్రస్తుత అసెంబ్లీలో 71 మంది సభ్యుల బలం ఉంది.