Puri temple Row: భోజనం పెడతామన్న అన్నామలై.. మాకు ‘‘బీఫ్’’ కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri temple Row: పూరీ జగన్నాథ ఆలయం ప్రస్తుతం ఎన్నికల వార్తల్లో నిలుస్తోంది. పూరీ జగన్నాథుడి ఆలయంలో రత్నబండార్ తాళాలపై ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఒడిశాలో అధికార నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ, బీజేపీకి మధ్య విమర్శలకు కారణమైంది. ప్రస్తుతం ఈ వివాదంలోకి తమిళనాడు కూడా వచ్చి చేరింది. ఇటీవల తప్పిపోయిన రత్న బండార్ తాళాలు తమిళనాడులో ఉన్నాయని ప్రధాని ప్రకటన చేశారు. బీజేడీ పార్టీలో నవీన్ పట్నాయక్ వారసుడిగా చెబుతున్న వీకే పాండియన్ని ఉద్దేశిస్తూ ఆరేళ్ల క్రితం ఈ తాళాలు తమిళనాడు చేరుకున్నాయని అన్నారు.
Read Also: Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
Also Read
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
అయితే, ఈ వ్యాఖ్యలు బీజేపీ, తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే, కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలకు వచ్చాయి. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కే. సెల్వపెరుంతగైం ప్రకటించారు. దీనిపై బీజేపీ చీఫ్ అన్నామలై స్పందిస్తూ.. ‘‘తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించబోతున్నామని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారని విన్నాను. మా కార్యాలయం వచ్చే తేదీని ముందుగానే ప్రకటిస్తే సౌకర్యంగా ఉంటుంది. వచ్చే పదిమందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. దీంతో పాటు తమిళులకు డీఎంకే, కాంగ్రెస్ చేసిన ద్రోహంపై ఓ పుస్తకాన్ని కూడా వారందరికీ బహుమతిగా ఇస్తాం అని చెప్పారు.
అన్నామలై వ్యాఖ్యలపై స్పందించిన ఇళంగోవన్, రెండు రోజుల ముందే తాము తేదీని ప్రకటిస్తామని, అయితే తమకు మాంసాహారం, గొడ్డుమాంస కావాలని డిమాండ్ చేశారు. ‘‘మేము అక్కడికి వస్తే, మాకు మాంసాహారం మరియు గొడ్డు మాంసం అవసరం. మేము రెండు రోజుల ముందు తెలియజేస్తాము. ఆయనను అన్ని సౌకర్యాలు చేయనివ్వండి’’ అంటూ ఇలంగోవన్ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై డీఎంకే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రజల్ని దొంగలుగా అభివర్ణిస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్దారు. ఈ వ్యాఖ్యలపై అన్నామలై మాట్లాడుతూ.. స్టాలిన్కి సలహాలు ఇచ్చేవారు వాస్తవాలు చెప్పడం లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే పోయిన తాళాలు దొరుకుతాయని మాత్రమే ప్రధాని వ్యాఖ్యానించారని చెప్పారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!