Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక, వాణిజ్య బంధాలు సరికొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. రాబోయే ఏడాది (2027) ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ కీలక ప్రకటనలో వెల్లడించారు. ఈ చారిత్రాత్మక వీవీఐపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు, ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ డీల్) వీలైనంత త్వరగా ఖరారు చేసేందుకు తానే స్వయంగా భారత్కు రానున్నట్లు రూబియో స్పష్టం చేశారు.
ఈ పర్యటన ప్రాధాన్యతను వివరిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాలే ఇరు దేశాల బలమైన బంధానికి ప్రధాన పునాది అని రూబియో కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఒక అంతర్జాతీయ శక్తంగా (గ్లోబల్ పవర్) ఎదిగిన తీరుకు తాను పెద్ద అభిమానిని అయ్యాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల భాగస్వామ్యం అపరిమితమైన అవకాశాలను అందుకోబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో భారత్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ‘భారీ ముడి చమురు’ (హెవీ క్రూడ్ ఆయిల్)ను శుద్ధి చేయగల అత్యుత్తమ సాంకేతికత కలిగిన కొన్ని దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు సరఫరాను పెంచేందుకు భారత్, అమెరికా, వెనిజులా దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు.
Also Read
- MP Uday Srinivas: 'జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం'.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
భారత అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు
భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ పరిణామాలపై కీలక సంకేతాలు ఇచ్చారు. భారత్, అమెరికాలు సహజ భాగస్వాములని, ఇరు దేశాల సంబంధాల్లో అపారమైన అవకాశాలు దాగున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అమెరికా తీసుకురాబోతున్న కొత్త వీసా విధానంపై వస్తున్న అపోహలను తొలగిస్తూ.. ఈ కొత్త వీసా వ్యవస్థ ఏ ఒక్క దేశాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించింది కాదని స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా, ప్రధాని మోడీ, అధ్యక్షుడు ట్రంప్ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత బంధమే ఇరు దేశాల భాగస్వామ్యానికి అతిపెద్ద బలమని, అంతర్జాతీయ వేదికలపై కీలకమైన గ్లోబల్ ఇష్యూస్ విషయంలో ఇద్దరు నేతల ఆలోచనలు ఒకేలా ఉన్నాయని రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!