MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Uday Srinivas: కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. జనసేన అధికారంలోకి వచ్చిన రోజే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాపు సీఎం అంశాన్ని భావోద్వేగ అంశంగా అభివర్ణించిన ఆయన, వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ 48 శాతం సీట్లు కాపులకు కేటాయించిందన్నారు. ప్రస్తుతం జనసేన తరఫున ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కాపు సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పారు.
అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 12 శాతం సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చిందని ఆరోపించారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్… కాపు సీఎం కావాలనే అంశంపై వైసీపీ కాపు నేతలు మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన ఆయన, కుల రాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలికారు. అయితే, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కులప్రస్తావన కొనసాగుతూనే ఉంది.. పార్టీ అధినేతలు.. ప్రజా ప్రతినిధులు.. నేతలు.. ఇలా ఎవరు మాట్లాడినా.. ఏదో ఒక సమయంలో కులం పేరు.. దాని ప్రస్తావన తేకుండా ముందుకు సాగరు..
Also Read
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!